తమిళనాడు సీఎం జయలలితపై నేటి నుంచి రోజువారీ విచారణ | Tamil Nadu Chief Minister Jayalalithaa   From today's daily trial | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎం జయలలితపై నేటి నుంచి రోజువారీ విచారణ

Apr 29 2014 3:10 AM | Updated on Aug 14 2018 4:21 PM

తమిళనాడు సీఎం జయలలితపై  నేటి నుంచి రోజువారీ విచారణ - Sakshi

తమిళనాడు సీఎం జయలలితపై నేటి నుంచి రోజువారీ విచారణ

ఆదాయానికి మించి రూ. 66.65 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారనే 18 ఏళ్లనాటి కేసులో తమిళనాడు సీఎం జె. జయలలితపై మంగళవారం నుంచి రోజు వారీ విచారణ తిరిగి ప్రారంభం కానుంది.

స్టే ఎత్తేసిన సుప్రీం కోర్టు
 
 న్యూఢిల్లీ: ఆదాయానికి మించి రూ. 66.65 కోట్ల ఆస్తులు  కలిగి ఉన్నారనే 18 ఏళ్లనాటి కేసులో తమిళనాడు సీఎం జె. జయలలితపై మంగళవారం నుంచి రోజు వారీ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కర్ణాటకలోని ట్రయల్ కోర్టు చేపట్టిన ఈ కేసు విచారణకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్.పి.పి)గా ఉన్న జి. భవానీ సింగ్ అనారోగ్య కారణాల రీత్యా వైద్య పరీక్షలకు వెళ్లారు. దీంతో ఈ నెల 7న సుప్రీం కోర్టు ఈ కేసు విచారణపై మూడు వారాల స్టే విధించింది.

కాగా, సింగ్ స్థానంలో సీనియర్ అడ్వొకేట్ ఎల్. నాగేశ్వరరావు ఎస్.పి.పిగా కేసును చేపట్టనున్న నేపథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్. చౌహాన్, జస్టిస్ జె. చలమేశ్వర్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణను మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. ఏఐఏడీఎంకే అధినేత అయిన జె. జయలలిత తమిళనాట 1991-96 మధ్య సీఎంగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి రూ.66.65 కోట్లు పోగేశారని కేసు నమోదైంది. విచారణ పారదర్శకంగా సాగేందుకుగాను సుప్రీం కోర్టు గతంలోనే ఈ కేసును తమిళనాడు నుంచి బెంగళూరులోని ట్రయల్ కోర్టుకు బదిలీ చేయడం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement