వెబ్‌కాస్టింగ్‌కు 7వేల మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు | RGUKT Stuedents for Polling Webcasting in Telangana | Sakshi
Sakshi News home page

వెబ్‌కాస్టింగ్‌కు 7వేల మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

Apr 29 2014 10:14 PM | Updated on Sep 17 2018 6:08 PM

ఎన్నికల్ వెబ్ కాస్టింగ్‌కు 7 వేల ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు వలంటీర్లుగా వెళ్తున్నట్లు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) వైస్ ఛాన్స్‌లర్ రాజ్‌కుమార్ తెలిపారు.

హైదరాబాద్: ఎన్నికల్ వెబ్ కాస్టింగ్‌కు 7 వేల ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు వలంటీర్లుగా వెళ్తున్నట్లు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) వైస్ ఛాన్స్‌లర్ రాజ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ, సీమాంధ్రలో జరిగే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో బాసర, ఇడుపులపాయ, న్యూజివీడు క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈనెల 30న తెలంగాణలో జరిగే ఎన్నికల్లో 2,250 మంది బాసర క్యాంపస్‌కు చెందిన విద్యార్థులు వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. 2011 నుంచి తమ విద్యార్థులు ఎన్నికల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement