సివిల్ సర్వెంట్లకు రాష్ట్రపతి పిలుపు
ఐఐపీఏ గోల్డెన్ జూబ్లీ వేడుకలను
ప్రారంభించిన ప్రణబ్ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో సివిల్ సర్వీసులు కీలక భూమికను పోషిస్తున్నాయని, సివిల్ సర్వెంట్లు ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ) గోల్డెన్ జూబ్లీ వేడుకలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపర్చాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజాసేవలో నాణ్యత ప్రమాణాలు పాటించడం అత్యంత ముఖ్యమని సూచించారు.
ప్రజలు మరింత ప్రభావవంతమైన పాలనను కోరుకుంటున్నారని, వారు పరిపాలన వ్యవహరాల్లో లోపాలను ఎంతమాత్రం క్షమించబోరని అన్నారు. త్వరితగతిన అభివృద్ధి సాధించాలంటే నిర్ణయాలు తీసుకోవడంలోనూ వేగాన్ని కనబర్చాలన్నారు. అయితే ఆ నిర్ణయాలు సహేతుకంగా ఉండాలన్నారు. దీటైన భారతదేశాన్ని నిర్మించడంలో పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలే ముఖ్య పాత్ర పోషిస్తాయని, అందుకే ఐఐపీఏ వంటి సంస్థలు ఉత్తమ పనితీరును కనపర్చాలని ఆకాంక్షించారు. పబ్లిక్ సర్వెంట్లను తీర్చిదిద్దడంలో ఐఐ పీఏ పనితీరు ఎంతో సంతృప్తికరంగా ఉందని అభినందించారు.
అనంతరం ‘ఇండియన్ గవర్నెన్స్ రిపోర్ట్-2012’ , ‘జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్’ పుస్తకాలను రాష్ట్రపతి ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసినందుకుగాను రాష్ట్రపతి ప్రణబ్కు రిటైర్డ్ ఐఆర్ఎస్, ఐఐపీఏ గోల్డెన్ జూబ్లీ కమిటీ చైర్మన్ బి.వి. కృష్ణకుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇతర అతిథులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐఐపీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, డెరైక్టర్, ఫేకల్టీ, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం కావాలి
Published Mon, Mar 31 2014 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement