నెల్లూరు కార్పొరేషన్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధుల వినియోగంపై అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరోపించారు.
నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధుల వినియోగంపై అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని మంత్రి నారాయణ పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు.
నిధులున్నా నగరంలోని ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కార్పొరేషన్ తీరుపై ఉద్యమిస్తామని చెప్పారు.