వెంకటలక్ష్మీ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ | YS sharmila conceals to venkatalakshmi family in karimnagar district | Sakshi
Sakshi News home page

వెంకటలక్ష్మీ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ

Sep 23 2015 6:29 PM | Updated on Sep 3 2017 9:51 AM

వెంకటలక్ష్మీ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ

వెంకటలక్ష్మీ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ

సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన కుంభం వెంకటలక్ష్మీ కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల బుధవారం పరామర్శించారు.

కరీంనగర్(సుల్తానాబాద్): సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన కుంభం వెంకటలక్ష్మీ కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని సమస్యలు ఉంటే తమకు ఫోన్‌ద్వారా వివరించాలని సూచించారు.

వైఎస్ షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లసూర్యప్రకాశ్, బోయినిపల్లి శ్రీనివాస్‌రావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వేణుమాధవరావులతో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శ యాత్రలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement