కాసేపట్లో విశాఖ చేరుకోనున్న వైఎస్ జగన్ | YS Jagan will reach Visakhapatnam | Sakshi
Sakshi News home page

కాసేపట్లో విశాఖ చేరుకోనున్న వైఎస్ జగన్

Nov 6 2016 12:06 PM | Updated on Jul 25 2018 4:09 PM

కాసేపట్లో విశాఖ చేరుకోనున్న వైఎస్ జగన్ - Sakshi

కాసేపట్లో విశాఖ చేరుకోనున్న వైఎస్ జగన్

‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ మరికాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు

విశాఖపట్నం: ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ మరికాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు. తొలుత నగరంలోని సర్క్యూట్ హౌస్‌కు ఆయన వెళ్తారు. అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం.. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సభాస్థలికి చేరుకుంటారు.

విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీకి మొండిచేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం, ప్రయోజనం లేని ప్యాకేజీని స్వాగతించిన రాష్ట్ర ప్రభుత్వాల తీరును 'జై ఆంధ్రప్రదేశ్' సభలో నేతలు ఎండగట్టనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement