అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | youth suspicious dead in guntur district | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Oct 30 2015 11:44 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.

నర్సారావుపేట: గుంటూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నర్సారావుపేట మండలం అచ్చమ్మపాలెంలో వ్యవసాయ బావిలో శుక్రవారం ఉదయం అచ్చి వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. మృతదేహాన్ని రైతులు బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.

గురువారం జరిగిన ఓ ఫంక్షన్ నుంచి వెంకటేశ్వర్లును ముగ్గురు స్నేహితులు తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో స్నేహితులే వెంకటేశ్వర్లును హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement