నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య | Youngster commits suicide on middle of street | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య

Oct 28 2015 6:16 PM | Updated on Oct 1 2018 6:38 PM

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడు నడిరోడ్డుపై మృతిచెందాడు.

వింజమూరు(నెల్లూరు): పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువకుడు నడిరోడ్డుపై మృతిచెందాడు. రోడ్డు మీద పడి కొట్టకుంటున్నా స్థానికులు ఎవరూ స్పందించకపోవడంతో.. అక్కడే మృతిచెందాడు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు బంగ్లాసెంటర్‌లో బుధవారం జరిగింది.

వివరాలు.. కొండాపురం మండలం గొట్టికొండాల గ్రామానికి చెందిన మౌలాలి(28) తాపి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు బంగ్లా సెంటర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement