'జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటాం' | Sakshi
Sakshi News home page

'జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటాం'

Published Tue, Aug 9 2016 7:25 PM

will owe to clean people foots with godavari water

నిజామాబాద్: గోదావరి జలాలతో జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్ భగరీథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజాం సాగర్ ప్రాజెక్టులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ సాధన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరూ అడ్డుకున్న వచ్చే రెండేళ్లలో నిజాం సాగర్కు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ పూర్తైతే గ్రామాల్లోకి రానివ్వరని, ఓట్లు వేయరనే భయంతోనే టీడీపీ, కాంగ్రెస్లు నాటకాలాడుతున్నాయని వారు మండిపడ్డారు.

Advertisement
Advertisement