హంద్రీనీవాకు నీరు విడుదల | water relese for handri neeva | Sakshi
Sakshi News home page

హంద్రీనీవాకు నీరు విడుదల

Aug 6 2016 12:17 AM | Updated on Sep 4 2017 7:59 AM

హంద్రీనీవాకు నీరు విడుదల

హంద్రీనీవాకు నీరు విడుదల

హంద్రీనీవా కాల్వకు శుక్రవారం నంద్యాల ఎంపీఎస్పీవైరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య..నీరు విడుదల చేశారు.

మిడుతూరు(నందికొట్కూరు): హంద్రీనీవా కాల్వకు శుక్రవారం నంద్యాల ఎంపీఎస్పీవైరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య..నీరు విడుదల చేశారు. నందికొట్కూరు మండలం మల్యాల మొదటి ఎత్తిపోతల పథకం వద్ద 9వ పంపునకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. స్విచ్‌ ఆన్‌ చేసి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈ జలంధర్‌ మాట్లాడుతూ.. కష్ణానది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో  భారీ వర్షం కురువడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరి,  శ్రీశైల జలాశయ నీటి మట్టం మధ్యాహ్నానికి  834.20 అడుగులు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం హంద్రీనీవాకు ఒక పంపు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, హంద్రీనీవా సామర్థాన్ని బట్టి విడతల వారిగా ఏడు పంపుల వరకూ నీటిని విడుదలచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నందికొట్కూరు, డోన్‌ టీడీపీ నియోజకవర్ట ఇన్‌చార్జ్‌లు కేఈ ప్రతాప్, మాండ్రశివానందరెడ్డి, ఈఈ పురుషోత్తంరెడ్డి, డీఈలు ప్రసాద్, పాండురంగయ్య, ఏఈలు మల్లికార్జున, విజయ్‌కిశోర్, నందికొట్కూరు మార్కేట్‌యార్డు చైర్మన్‌  గుండం రమణారెడ్డి, ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, నాయకులు వెంకట్రామిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement