Sakshi News home page

కలకలం రేపిన పొట్టు బస్తాలు

Published Sun, Dec 11 2016 11:57 PM

unknown bags found

బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రం సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాల్వలో సుమారు  పొట్టుతో కూడిన 50 బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడంతో కలకలం రేగింది. ఈ బస్తాలో ఉన్న పొట్టు ఒక రకమైన వాసన వస్తుండటంతో ఎందుకు ఉపయోగిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సింగవరం, సోమయాజులపల్లె గ్రామానికి చెందిన ప్రజలు అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. ఆ విధంగా సంచుల్లో ఉన్న పొట్టును మసాలా తయారీలో కల్తీ చేయడానికి తీసుకెళ్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement