బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రం సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాల్వలో సుమారు పొట్టుతో కూడిన 50 బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడంతో కలకలం రేగింది. ఈ బస్తాలో ఉన్న పొట్టు ఒక రకమైన వాసన వస్తుండటంతో ఎందుకు ఉపయోగిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సింగవరం, సోమయాజులపల్లె గ్రామానికి చెందిన ప్రజలు అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. ఆ విధంగా సంచుల్లో ఉన్న పొట్టును మసాలా తయారీలో కల్తీ చేయడానికి తీసుకెళ్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
Related news
-
ఎన్నికల ‘కురుక్షేత్రం’.. మూటలు మోసిన కుబేరుడు!
Naveen Jindal: ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆకట్టుకోవడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అపర కుబేరుడు, జిందాల్ స్టీల్స్ ఛైర్మన్ నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్లో కొనసాగారారు. 2004, 2009 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కొద్దిరోజుల కిందటే కాషాయ కండువా కప్పుకొన్న నవీన్ జిందాల్ అదే కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్తో రంగంలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ జిందాల్.. స్థానిక మార్కెట్ యార్డులో మూటలు మోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 50 కేజీల గోధుమ మూటను ఎత్తుకుని లారీలోకి లోడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. హర్యానాలోని మొత్తం 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అన్ని లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఆరో విడతలో అంటే మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయడానికి అటు ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష కూటమి పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. हरियाणा के किसान, देश की जान...🙏 pic.twitter.com/WNdJZduS1P — Naveen Jindal (@MPNaveenJindal) April 17, 2024 -
వాడేసిన ప్లాస్టిక్తో వండర్స్
మనింట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్ కవర్లనే రాజిబెన్ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్ పెరిగి పెద్దదయ్యి లండన్ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా? వృధా ప్లాసిక్. వాడేసిన ప్లాస్టిక్ రోడ్ల మీద, ఇళ్ల డస్ట్బిన్లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ. ఎలా చేస్తారు? వాడేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను సేకరించి సర్ఫ్ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్ మందంగా ఉంటే అర ఇంచ్ వెడల్పు రిబ్బన్లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్ రిబ్బన్లుగా కట్ చేస్తారు. ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని కట్ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్ బ్యాగ్లు, కూరగాయల బ్యాగ్లు, ఫోన్ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి. ఎలా వచ్చింది ఐడియా? రాజి బెన్ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్పర్ట్గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు. ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్లో ఒక ఎన్.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించేవారు. 2012లో జరిగిన ఎగ్జిబిషన్లో ఒక విదేశీ డిజైనర్ ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి తయారు చేసిన బ్యాగ్ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్ ప్లాస్టిక్ నుంచి రాజి బెన్ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది. స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ రాజి బెన్ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి. రాజి బెన్ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం. -
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
పొల్యూషన్కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్!
ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని చాలా వరకు కాలుష్య కారకాలే అని చెప్పాలి. హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువులో ఏదో రకంగా ప్లాస్టిక్, లెథర్ వంటి వస్తువులతోనే తయారు చేస్తారు. పర్యావరణానికి హాని లేకుండా చేసే వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్తో కొరతను భర్తీ చేస్తోంది ముంబైకి చెందిన సుప్రియ శిర్సత్ సతమ్. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్తో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఆయా ఫ్యాషన్ బ్రాండ్లను ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఆదరించారు. దీని ఫలితంగా గ్రామాల్లో ఉండే వేలమంది కళాకారులకు ఉపాధి లభించినట్లయ్యింది. సుప్రియ ఎలా ఈ రంగంలోకి వచ్చింది, ఆమె ఏవిధంగా వీటిని ఉత్పత్తి చేసిందంటే.. సుప్రియా ఇంతవరకు మార్కెట్లోకి రాని వేగన్కి సంబంధించిన ఫ్యాషన్ బ్రాండ్లు తీసుకురావాలని అనుకుంది. పర్యావవరణానికి హాని కలిగించనటువంటి మంచి ఉత్పత్తులు తీసుకుని రావాలనుకుంది. అందుకోసం సహజ ఫైబర్లతో చేసే ఉత్పత్తులను ప్రోత్సహించింది. అందులో భాగంగా అరటిచెట్టు బెరడు, వాటి పళ్ల తొక్కలతో తయారు చేసే ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. తొలుత ముందుగా స్మాల్ కీపింగ్ యూనిట్(ఎస్కేయూ)గా ప్రారంభించింది. అవే ఇప్పుడు ముంబైలో 200 ఎస్కేయూ యూనిట్లుగా విస్తరించాయి. ప్రారంభంలో కార్క్ హ్యాండ్ బ్యాగ్లు, వాలెట్లతో ప్రారంభమైంది. ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన వాలెట్లు, హ్యాండ్బ్యాగ్లు, ఆభరణాలను కూడా అందిస్తోంది. తన ఉత్పత్తులకు "ఫోర్ట్" అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో కూడా ఈ బ్రాండ్కి మంచి స్పందన వచ్చింద. ఈ బ్రాండ్ రాజస్తాన్, మహారాష్ట, తోసహా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మంది గ్రామీణ మహిళా కళాకారులకు చేయూతనిచ్చింది. బ్రాండ్ ప్రారంభంలో కార్క్ హ్యాండ్బ్యాగ్లు మరియు వాలెట్లతో ప్రారంభమైంది మరియు ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు వాలెట్లు, టోట్ బ్యాగ్లు, హ్యాండ్బ్యాగ్లు, ఆభరణాలను అందిస్తోంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ని విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధరించారు. సతమ్ నేపథ్యం.. సతమ్ మార్కెటింగ్లో ఎంబీఏ చేసిన ఇంజనీర్. జెట్ ఎయిర్వేస్లో మొబైల్ కామర్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఒక దశాబ్దం పాటు పనిచేసింది. సతమ్కి కళ, క్రాప్ట్ అంటే మంచి ఆసక్తి ఉంది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా హస్తకళాకారులతో పనిచేసే టెక్స్టైల్ రంగం కావడంతో ఆమె అనూహ్యంగా ఇటువైపుకి మళ్లింది. ఫ్యాషన్ పరంగా సౌందర్య సాధానాలు సహజసిద్ధమైన వాటితో తయారు చేయని బ్రాండ్లు లేకపోవడాన్ని గమనించింది. తానే ఎందుకు వాటిని ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ "ఫోర్ట్ బ్రాండ్". 2019లో కేవలం లక్షరూపాయలతో ఈ ఫోర్ట్ని ప్రారంభించింది. తాను సహజసిద్ధ ప్రొడక్ట్లను తయారు చేసేందుకు చాలా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది సతమ్. అరటిపండు వేసవికాలం, వానాకాలాల్లో అది జీర్ణమైనప్పడూ ఏర్పడే మచ్చల ఆధారంగా దీన్నే మెటీరియల్గా తీసుకోవాలని భావించానని చెప్పింది. హ్యాండ్ బ్యాగ్ల తయారీకి జంతువుల తోలుకి ప్రత్యామ్నాయం ఓక్ చెట్ల నారను ఉపయోగిస్తాం. ఇక అరటి చెట్టుని పండ్లను వినియోగించేసిన తర్వాత కొట్టేస్తారు కాబట్టి వాటి నారతో బ్యాగ్లు వ్యాలెట్లను తయారు చేస్తాం. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఇక ఆభరణాల విషయానికి వస్తే..బెరడులతో పింగాణీ, 18-క్యారెట్ బంగారం లేదా మిశ్రమ లోహం వంటి ఇతర ప్రీమియం మెటీరియల్ల కలయికతో విలక్షణంగా రూపొందిస్తున్నాం అని సతమ్ వివరించింది. బ్రాండ్ ధరలు ఎలా ఉంటాయంటే.. ఈ బ్రాండ్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ల ధర రూ. 4500 నుంచి 14,000 వరకు ఉంటుంది. ఇక ఆభరణాల ధర రూ. 800 నుంచి రూ. 17,000 వరకు ఉంటుంది.ఈ ఫోర్ట్ బ్రాండ్తో సతమ్ మంచి సక్సెస్ని అందుకుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ఆరుగురు సభ్యలుతో కూడిన బృందంతో పనిచేస్తుంది. ఈ బ్రాండ్ గడ్డి, జనపనారతో తయారు చేసే బ్రాండ్లతో పోటీపడుతుండటం గమనార్హం. ఈ ఫోర్ట్ బ్రాండ్ 2022లో ఉత్తమ వేగన్ వాలెట్ల పరంగా పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తన వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా అమలా ఎర్త్ వంటి సముచిత ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్ల ద్వారా కూడా విక్రయిస్తోంది. ఆఫ్లైన్లో కూడా విక్రయించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో విక్రయిస్తుంది. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
ఆమె పేరే ఓ బ్రాండ్
గుజరాత్లోని కచ్లో ఒక మారుమూల గ్రామవాసి పాబిబెన్ రబారి. మేకలు, గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా ఉన్న పాబిబెన్ ఇప్పుడు 300 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. జరీ ఎంబ్రాయిడరీ, బ్యాగుల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. హస్తకళాకారిణిగా ఆమె కృషి, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పాబిబెన్ బాల్యం తీవ్ర కష్టాలతో గడిచింది. ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం, తల్లి కొన్ని ఇళ్లలో పాచిపని చేస్తూ తనను, తన చెల్లెలిని పెంచిన విధానాన్ని, మేకలను, గొర్రెలను మేపుకుంటూ బతికిన రోజులను గుర్తు చేసుకుంటుంది ఆమె. ఉన్న కొద్దిపాటి సమయంలో తల్లి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పని చేస్తుండేది. అక్కడి వారి కమ్యూనిటీ వివాహ వేడుకల సమయాల్లో తప్పనిసరిగా ధరించే సంప్రదాయ ఎంబ్రాయిడరీ బ్లౌజులు, దుప్పట్లను తయారు చేసేది. ఒక్కో సంప్రదాయ ఎంబ్రాయిడరీ తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టేది. ఈ సంప్రదాయం కారణంగా వారి కమ్యూనిటీలో వివాహాలు ఆలస్యం అయ్యేవి. దీంతో కొన్నాళ్లకు ఈ ఎంబ్రాయిడరీని ఆ కమ్యూనిటీ పక్కనపెట్టేసింది. ఈ సమయంలోనే పాబిబెన్ ఈ సంప్రదాయ ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం సాధించింది. ఒక కళారూపం కనుమరుగు కాకుండా కాపాడాలని నిశ్చయించుకుంది. తమ కమ్యూనిటీలో సంప్రదాయ ఎంబ్రాయిడరీని ప్రతిబింబించే కొత్త రూపాన్ని కనిపెట్టింది. ఇది వేగంగా, తక్కువ శ్రమతో కూడుకున్న కళ కావడంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. పాబిబెన్ మొదట నలుగురైదుగురు మహిళలతో కలిసి వివాహ సమయంలో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజ్లను తయారు చేసేది. చదువు లేకపోయినా తమకు వచ్చిన కళను కాపాడాలని, సాటి మహిళలకు ఉపాధి కల్పించాలనుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలను కలిసింది. కళలకు సంబంధించిన ఆ సంస్థల నుండి కొన్ని ప్రాజెక్ట్ వర్క్లను తీసుకుంది. ‘కానీ, నన్ను ఒక ఆలోచన ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఈ కళ మా సొంతం. కానీ, మాకు సరైన గుర్తింపు వచ్చేది కాదు. మేం తయారు చేసిన వాటిని వేర్వేరు బ్రాండ్ల కింద అమ్మేవారు. దీనినుంచి బయటపడేందుకు, మా హస్తకళకు మేమే ప్రాచుర్యం తెచ్చుకోవాలని ఉండేది. దీంతో పెద్దస్థాయి అధికారులను కలిశాను. వారి సూచనల మేరకు మా కళకు ఒక ఇంటిని ఏర్పాటు చేశాం. చేతివృత్తుల వారికి మార్కెట్ ప్లేస్గా ఆ స్థలాన్ని ప్రారంభించాం. మొదట ఇది చిన్న వ్యాపారంగానే ప్రారంభమైంది కానీ, పనితో పాటు గుర్తింపు కూడా రావాలనుకున్నాను. అది ఈ ఏడేళ్ల సమయంలో సాధించగలిగాం’ అని చెబుతుంది పాబిబెన్. పాబిబెన్ మొదటి ఉత్పత్తి స్లింగ్ బ్యాగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘పాబీ బ్యాగ్’ అని ఆమె పేరుతోనే ఆ బ్యాగ్ను పిలిచేటంత ఘనత సాధించింది ఈ హస్తకళాకారిణి. పాబిబెన్ బ్రాండ్తో ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ‘పాబిబెన్.కామ్’ అక్కడి గ్రామీణ మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతోంది.
Related News by category
-
‘ఆప్’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతీకి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఆసుపత్రి ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్ధారణ కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తున్నట్లు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర పాండే శనివారం స్పష్టం చేశారు. రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమ్నాథ్ భారతీకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. 2016 సెప్టెంబర్ 9న సోమ్నాథ్ భారతీ మరో 300 మందితో కలిసి ఎయిమ్స్ ప్రహరీ గోడపై ఉన్న ఫెన్సింగ్ను ధ్వంసం చేసినట్లు కేసు నమోదయ్యింది. అంతేకాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో 2014లో అర్ధరాత్రి సమయంలో ఓ ఆఫ్రికా మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. -
కరోనా వ్యాక్సిన్ ‘రెడీ టూ యూజ్’ : రష్యా మంత్రి
మాస్కో: కరోనా వైరస్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వేగంగా కదులుతున్న రష్యా మరో కీలక విషయాన్ని ప్రకటించింది. తమ దేశానికి చెందిన కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ వాడకానికి వచ్చే నెలలోనే సిద్ధంగా ఉంటుందని ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్ ప్రకటించారు. మాస్కోకు చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలికోవ్ ఈ విషయం చెప్పారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. తమ వ్యాక్సిన్కు సంబంధించిన మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశామని సాలికోవ్ తెలిపారు. ముఖ్యంగా రెండవ దశ పరీక్షలు విచారణ సోమవారం ముగిసాయనీ, వీరందరూ కరోనావైరస్ నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నారని, త్వరితంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను వేలాదిమందిపై త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఎపుడు మొదలుపెట్టేదీ, టీకా ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సాలికోవ్ చేసిన వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా మాస్కోలోని ప్రభుత్వ సంస్థ గమలేయ ఇన్స్స్టిట్యూట్ అండ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో కరోనావైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యన్ ఆర్మీ ఇటీవల ప్రకటించింది. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేలాది మంది వాలంటీర్లతో దశ-3 మానవ క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయనీ, టీకా పంపిణీ సెప్టెంబరు నాటికి ప్రారంభమవుతుందని (ఆర్డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రోవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిమిత్రోవ్ ప్రకారం, దేశీయంగా 30 మిలియన్ మోతాదులను, అంతర్జాతీయంగా170 మిలియన్లను తయారు చేయనుంది. వ్యాక్సిన్ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి. -
శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరిదేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాదిలానే తెలంగాణా నుంచి అమ్మ వారికి బోనాలను సమర్పించేందుకు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం ఇంద్రకీలాద్రికి విచ్చేయనుంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మ వారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్త బృందాలు అమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఉత్సవాలు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తాయి. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు అమ్మ వారి దర్శనాన్ని నిలిపివేస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు అమ్మ వారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాలను, మూలవిరాట్లకు కాయగూరలు, పండ్లు, డ్రైప్రూట్స్తో అలంకరిస్తారు. ఆలయాలను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించేందుకు అవసరమైన కూరగాయల దండలను సేవా సిబ్బంది, భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపుగా బోనాలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనాలను సమర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది. కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ అమ్మ వారి అలంకరణకు తొలి రోజైన ఆదివారం ఆకుకూరలను వినియోగిస్తారు. రెండో రోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడో రోజైన మంగళవారం బాదం, జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ప్రూట్స్తో అలంకరిస్తారు. అమ్మ వారి అలంకరణకు ఉపయోగించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడు రోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకూకూరలను దండలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తుంటారు. దేవస్థానం కదంబం ప్రసాదాన్ని అమ్మ వారి మహా ప్రసాదంగా భక్తులకు వితరణ జరుగుతుంది. దేవస్థాన ఉచిత ప్రసాదాల కౌంటర్లో కదంబం ప్రసాదాన్ని వితరణ చేస్తారు. నేడు లక్ష మంది దర్శనం ఒక వైపు శాకంబరిదేవి ఉత్సవాలు, మరో వైపున తెలంగాణా నుంచి బోనాలు, ఆదివారం, ఆషాఢ సారెను సమర్పించేందుకు తరలివచ్చే భక్త బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ నెలకొంది. ఒకే రోజు మూడు విశేషమైన ఉత్సవాలు జరుగుతుండటంతో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష పైబడి భక్తులు అమ్మ వారి దర్శనానికి విచ్చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మ వారి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి. మరో వైపున ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాలను దేవస్థాన కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
నారాజ్ చేయొద్దు
రైతు: రాజు, ఏదులాపూర్, శివ్వంపేట మండలం 139/2 సర్వే నంబర్లో 26. 1/2 (ఇరువై ఆరున్నర గుంటల) భూమి కుమారి సులోచనపై రిజిస్ట్రేషన్ చేయించాము. కాని కొత్త పాస్బుక్లో 20.1/2(ఇరవైన్నర) గుంటల భూమి ఉన్నట్లు నమోదు చేశారు. మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే గ్రామశివారులోని ముత్తయ్య చెరువు కాలువను దాడ్వాయి అశోక్ అనే వ్యక్తి పూడ్చేశారు. ఈ విషయంపై ముత్యాలు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: పాత రికార్డుల ప్రకారం ఎంత ఉంటే అంతా సర్వే చేయిస్తాము. ముతయ్య చెరువు కాలువ పూడ్చివేత పై చర్యలు తీసుకుంటాను. సాక్షి మెదక్/మెదక్ రూరల్: సాధాబైనామాలో భూమి తగ్గింది రైతు: రెడ్డిగారి వీరమణి, యెనగండ్ల గ్రామం, కొల్చారం మండలం కొల్చారం మండలం యెనగండ్ల గ్రామశివారులో గల 62 సర్వే నంబర్లో 2.4 ఎకరాల పట్టా భూమి ఉండగా, సాధాబైనామా తర్వాత అందులో 12 గుంటల భూమి తగ్గించి మంగళి ఆగమయ్య పేరిట నమోదు చేశారు. సంబంధిత తహసీల్దార్కు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. జేసీ: మీ సమస్య గురించి సంబంధిత తహసీల్దార్తో మాట్లాడి పరిష్కరిస్తాను. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జా చేశారు రైతు: నర్సయ్య, నిజాంపేట మండలం, నస్కల్ గ్రామం గ్రామ శివారులో గల 229/అ సర్వే నంబర్లో నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి ఇచ్చారు. అందులో తమకు ఇచ్చిన 1.15 ఎకరాల భూమిని ఇతరులు కబ్జా చేశారు. అధికారులను పొజిషన్ చూపించాలని కోరితే పట్టించుకోవడం లేదు. జేసీ: సర్వేయర్ను పంపించి సమస్యను పరిష్కరిస్తాము. ఐదు గుంటలు తక్కువ నమోదు చేశారు రైతు: లక్ష్మీనర్సయ్య, నిజాంపేట మండలం, కె. వెంకటాపూర్ గ్రామం గ్రామ శివారులోని 315, 316, 317 సర్వే నంబర్లలో మొత్తం 2 ఎకరాల పట్టా భూమి ఉంది. కాని కొత్త పాస్బుక్లో 5 గుంటల భూమిని తగ్గించి నమోదు చేశారు. జేసీ: సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు చెప్పి న్యాబద్ధమైనదైతే సరిచేస్తాము. పాస్బుక్కులు ఇవ్వలేదు రైతు: నర్సింలు, రామాయంపేట రామాయంపేట శివారులోని 1421 సర్వే నంబర్లో గల లవాణీ పట్టా భూమికి సంబంధించి 15 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చి పాస్బుక్కులను ఇవ్వలేదు. జేసీ: ఆ భూమిలో ఏం పంటలు సాగు చేస్తున్నారు. సర్వేయర్ను పంపించి వారం రోజుల్లోగా పాస్బుక్కులను ఇప్పిస్తాము. మా భూమిని కబ్జా చేశారు రైతు: నర్సింలు, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలం గ్రామ శివారులోని 234 సర్వే నంబర్లో ఉన్న అసైన్డ్ భూమికి సంబంధించి 1977లో తాత పేరిట సర్టిఫికెట్ ఇచ్చారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లాము. ప్రస్తుతం తమ భూమిని పక్క పొలం వ్యక్తి కబ్జా చేశాడు. జేసీ: మూడేళ్లకు మించి ఆ భూమిలో పొజిషన్లో లేకుంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది. భూమిని సాగు చేస్తున్న వాళ్లకే వర్తిస్తుంది. భూ సమస్యను పరిష్కరించండి రైతు: సూర్యం చౌహాన్, బిక్యాతండా, శివ్వంపేట మండలం పంచాయతీ పరిధిలో గల 315, 316 సర్వే నంబర్లో ఉన్న భూ సమస్యను పరిష్కరించి రైతులకు పాస్బుక్కులు అందించగలరు. జేసీ: భూమి ఉన్నదాని కంటే ఎక్కువ ఉండటం వల్ల ఫారెస్ట్ అధికారులు గెజిట్ పబ్లికేషన్ తీసుకొచ్చి హద్దులు వేశారు. సమస్య ఉన్నందున ఆ భూమిని పార్ట్ బీలో పెట్టడం జరిగింది. సర్వే చేయించి సమస్య పరిష్కరించి పాస్బుక్లను అందిస్తాము. లవాణీ పట్టా కొనుగోలు చేశాం రైతు: నర్సింగ్, చిన్నచింతకుంట గ్రామం, నర్సాపూర్ గ్రామ శివారులోని 918 సర్వే నంబర్లో లవాణీ పట్టాను కొనుగోలు చేశాము. పట్టా చేయడం లేదు. జేసీ: హెచ్ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి చట్ట ప్రకారం పట్టా కాదు. పాస్బుక్ ఇప్పించండి రైతు: సిద్ధయ్య, వడియారం గ్రామం, చేగుంట మండలం సర్వే నంబర్ 642లో గల 32 గుంటల ఇనాం భూమికి సంబంధించి పాస్బుక్ రాలేదు. జేసీ: ఓఆర్సీ ఇప్పించి 10 రోజుల్లో పాస్బుక్లను అందిస్తాము. ఒకే భూమిని ఇద్దరికి విక్రయించారు రైతు: వహీబ్ఖాన్, నర్సాపూర్ సర్వే నంబర్ 17/12లో గల లవాణీ పట్టా భూమిని 1989లో తీసుకున్నాము. కాని అదే భూమిని 2006లో ఇతరులకు విక్రయించారు. ఇలా ముగ్గురి పేర్లమీద ఉంది. జేసీ: ఆ భూమిని ఎవరూ కొనడానికి వీలులేదు. అందులో చేపట్టిన నిర్మాణాలను పడగొట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటాము. భూమిని మ్యూటేషన్ చేస్తలేరు రైతు: శ్రీనివాస్, రాజ్పల్లి, మెదక్ మండలం సర్వే నంబర్ 427/అ 2లో గల 13 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించాము. కాని మోటేషన్ చేయమంటే సంబంధిత వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాము. అధికారులు పట్టించుకోవడం లేదు రైతు: విభూది రాచప్ప, దొంతి గ్రామం, శివ్వంపేట మండలంతల్లి ఎల్లమ్మ పేరిట ఉన్న 8గుంటల పట్టా భూమిని పౌతి చేయమంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకుంటాను. నా భూమి వేరే వ్యక్తి పేరిట నమోదైంది రైతు: నారాయణ, శివాయిపల్లి, మెదక్ మండలం 43/ఇ2 సర్వేనంబర్లో గల 13 గుంటల బారాణ భూమిని నా పేరుతో ఉన్న మరో వ్యక్తి అయిన నారాయణ పేరిట నమోదయ్యింది. మా పేర్ల పక్కన తండ్రి పేరును గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సమస్య పరిష్కరించాలని వీఆర్వో, ఎమ్మార్వోల చుట్టూ తిరిగినా పట్టించుకోవడవం లేదు. జేసీ: వారం రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. పాస్బుక్కులు ఇవ్వలేదు రైతు: బిక్షపతి, రాయిలాపూర్, కౌడిపల్లి మండలం 394, 387 సర్వే నంబర్లో ఉన్న రైతులకు ఎవరికి పాస్బుక్కులు రాలేవు. దీంతో రైతుబంధు, రైతుబీమా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. జేసీ: వారం రోజుల్లో సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తాను. ఇద్దరికి చెందాల్సిన భూమిని ఒక్కరికే ఇచ్చారు రైతు: శంకరయ్య, ఎల్లుపల్లి, టేక్మాల్ మండలం 141 సర్వే నంబర్లో గల 21 గుంటల భూమి శంకరయ్య, సుధాకర్ల పేరు మీద ఉంది. కాగా సాధా బైనామాలో ఇద్దరికి చెందిన భూమిని సుధాకర్ ఒక్కిరి పేరిట రాసారు. జేసీ: ఆర్డీఓకు ఆర్ఓఆర్ అప్పీల్ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. పాస్బుక్ రాలేదు రైతు: విజయ్కుమార్, కోనాపూర్ గ్రామం, రామాయంపేట433/202 సర్వే నంబర్లో గల ఎకరం లవాణీ పట్టా భూమికి సంబంధించి పాస్బుక్ రాలేదు. జేసీ: పార్ట్ బీలో ఉన్నందు వల్ల పాస్బుక్ రాకుండవచ్చు. సర్వేచేయిస్తాను. రిజిస్ట్రేషన్ చేసినా బుక్లో నమోదు చేస్తలేరు రైతు: కుమ్మరి మల్లేషం, శెట్టిపల్లి గ్రామం, వెల్ధుర్తి మండలం గ్రామ శివారులో 38 సర్వే నంబర్లో 14 గుంటల పట్టా భూమిని కొనుగోలు చేసి 2006 రిజిస్ట్రేషన్ చేయించాము. కాని బుక్లో నమోదు చేయడం లేదు. అలాగే 289, 38 సర్వే నంబర్లలో ఉన్న భూమిలో 15 గుంటల భూమి తక్కువ వస్తుంది. సంబంధిత ఎమ్మార్వో, వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: మీసేవలో పెట్టిన దరఖాస్తు ఉందా. మీసేవలో రూ.145 చెల్లించి నమోదు చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మీసేవ రశీదును వాట్సప్కు పెట్టండి. కొన్న భూమిని కోల్పోవాల్సి వస్తుంది రైతు: రఘుపతి, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలంగ్రామ శివారులోని 260 సర్వే నంబర్లో గల 35 గుంటల పట్టా భూమిని మా తండ్రి లక్ష్మీనారాయణ పేరిట కొనుగోలు చేశాము. కాని 266 సర్వే నంబర్లో ఉందంటున్నారు. కాగా 260 సర్వే నంబర్లో గల భూమి జాతీయ రహదారి విస్తరణలో పోతుంది. సమస్యను పరిష్కరించండి. జేసీ: రికార్డు ప్రకారం సర్వే నంబర్లో ఉన్న భూమిపై హక్కు ఉంటుంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. లేకుంటే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. బీఈడీ ఎంట్రెన్స్లో నిజాంపేట వాసికి 13వ ర్యాంక్ నిజాంపేట(మెదక్): నిజాంపేట గ్రామానికి చెందిన యువకుడు బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షలో సాంఘీకశాస్త్ర్రంలో 13వ ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు నిజాంపేట గ్రామానికి చెందిన వోగుల సురేష్ గత నెల 31న జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా 13వ ర్యాంక్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు పెద్దశంకరంపేట(మెదక్): వర్షాలు సమృద్ధిగా కురియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడిచంద్రశేఖర్శర్మ హనుమాన్ ఆలయంలో చందనోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కేవీపీఎస్ జిల్లా కమిటీ ఎన్నిక నర్సాపూర్: కుల వివక్ష వ్యతిరేఖ పోరాట సమితి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నర్సాపూర్లో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా మహా సభల్లో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తుకారం, నాగరాజులు ఎన్నికయ్యారు. తమతో పాటు 19 మందితో కూడిన జిల్లా కమిటీని ఎంపిక చేశారని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని వారు పేర్కొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి మనోహరబాద్(తుప్రాన్): వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృచెందారు. ఎస్ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. కూచారం గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(35) తన ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్ను పక్కకు పెట్టడానికి కింద నిలబడి స్టార్ట్ చేయగా గేర్లో ఉన్న ట్రాక్టర్ అకస్మాత్తుగా అతనిపైనుంచి వెళ్లింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీకొని.. కొనాయిపల్లి (పీటీ)గ్రామానికి చెందిన శెట్టి బాబు (28) తన బైక్పై పనినిమిత్తం రంగాయిపల్లి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ చేసినట్లు సీడీపీఓ సోమశేఖరమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దశంకరంపేట అంగన్వాడీ టీచర్, గడిపెద్దాపూర్ తండా మినీ అంగన్వాడీ టీచర్, అల్లాదుర్గం మండలం గొల్లకుంట, రేగోడ్ మండలం కొండాపూర్, జంగంలోంక తండా, టేక్మాల్ మండలం పల్వంచ, పెద్దశంకరంపేట మండలం ఉతూలుర్ గ్రామల అంగన్వాడీ ఆయా పోస్టులు భర్తీ చేయడమైందని, పోస్టులు పొందినవారు అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయంలో ఉత్తర్వులు తీసుకుని జాయినింగ్ కావాలని ఆమె తెలిపారు. పోస్టుల లిస్టు కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు. నాలుగు మండలాల్లో.. రామాయంపేట(మెదక్): స్థానిక ఐసీడీఎస్ పరిధిలోని రామాయంపేట, నార్సింగి, చేగుంట, వెల్దుర్తి మండలాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను ఎంపిక కార్యక్రమం పూర్తయిందని స్థానిక ప్రాజెక్టు సీడీపీవో స్వరూప తెలిపారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, మక్కరాజ్పేట, శంఖాపూర్, బోనాల గ్రామాల్లోని ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. మక్కరాజ్పేట, శంఖాపూర్, బోనాల, రామాయపల్లి సెంటర్లలో హెల్పర్లు, మినీ కేంద్రాలైన కోనాపూర్ పెద్ద తండా, చిన్నతండాలో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని ఆమె తెలిపారు. ఎంపికైనవారి వివరాలు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని, లిస్టు చూసుకోవాలని ఆమె సూచించారు. కాయిదంపల్లిలో పింఛన్ల పంపిణీ అల్లాదుర్గం(మెదక్): గురువారం సాక్షి దినపత్రికలో పింఛన్ పాట్లు అనే శీర్షికతో వార్త ప్రచురితం అయింది. గ్రామాల్లో పింఛన్ ఇవ్వడం లేదని, పోస్టాఫీస్లో పింఛన్లు ఇవ్వడంతో గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన పోస్టల్ సిబ్బంది శుక్రవారం కాయిదంపల్లి గ్రామానికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల గ్రామాల్లోనే పింఛన్లు పంపిణీ చేయిస్తామని ఎంపీడీఓ విద్యాసాగర్ చెప్పారు. -
అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్
కోదాడ : చదువులో తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రీడా సమరానికి సూర్యపేట జిల్లా, కోదాడ మండలంలోని నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల ఆతిథ్యం ఇస్తోంది. గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా బుధవారం ఈ క్రీడాసమరానికి తెరలేవనుంది. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఐదో జోనల్ మేట్-2018లో అండర్-17 విభాగంలో 28 పాఠశాలల బాలికలు, అండర్-19 విభాగంలో 33 కళాశాలల 1840 మంది విద్యార్థినులు తమ సత్తా చాటనున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
Advertisement