అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా | uninterrupting power supply | Sakshi
Sakshi News home page

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా

Dec 10 2016 11:55 PM | Updated on Sep 4 2017 10:23 PM

వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ అజయ్‌జైన్‌ అన్నారు.

కర్నూలు(రాజ్‌విహార్‌): వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని  ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ అజయ్‌జైన్‌ అన్నారు. శనివారం ఆయన విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోస్తాంధ్ర పాంతంలో   వర్షాలు కరుస్తుండడంతో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిస్తే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతులు, వినియోగదారుల సేవల్లో లోపం లేకుండా చూడాలని, సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని ఆదేశించారు.  సమావేశంలో ఎస్‌ఈ భార్గవ రాముడు, డీఈ మహమ్మద్‌ సాధిక్, ఏడీఈ శేషాద్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement