వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
తిమ్మాపూర్(కరీంనగర్): వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్కూటీ పై వెళ్తున్న వారిని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.