ధృవ సినిమా చూసి వస్తుండగా ప్రమాదం.. | two mega fans dies after returns from druva movie | Sakshi
Sakshi News home page

ధృవ సినిమా చూసి వస్తుండగా ప్రమాదం..

Dec 10 2016 8:07 AM | Updated on Jul 14 2019 1:57 PM

ధృవ సినిమా చూసి వస్తున్న రామ్ చరణ్ అభిమానులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఇద్దరు మృతి...12 మందికి గాయాలు
వావిలాల(జోగుళాంబ గద్వాల): ధృవ సినిమా చూసి వస్తున్న రామ్ చరణ్ అభిమానులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా 12 మంది గాయాలపాలయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వావిలాలకు చెందిన 14 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్ శుక్రవారం రాత్రి అయిజలో ధృవ సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం వారు తిరిగి ఆటోలో బయలుదేరారు.

వారి ఆటోను పందెపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని రాజు, సతీష్ అనే యువకులు అక్కడికక్కడే చనిపోయారు. 12 మంది తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement