ఆరు గ్రామాల్లో ట్రాన్స్‌కో విజిలెన్స్‌ దాడులు | transco vigilens rides | Sakshi
Sakshi News home page

ఆరు గ్రామాల్లో ట్రాన్స్‌కో విజిలెన్స్‌ దాడులు

Aug 27 2016 7:18 PM | Updated on Sep 4 2017 11:10 AM

చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, నవాబుపేట, ఒగులాపూర్, సుందరగిరి గ్రామాల్లో విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడిన 47 మందిపై విజిలెన్స్‌ డీఈఈ గంగాధర్‌ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేశారు.

  • 47 మందిపై కేసులు
  • చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, నవాబుపేట, ఒగులాపూర్, సుందరగిరి గ్రామాల్లో విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడిన 47 మందిపై విజిలెన్స్‌ డీఈఈ గంగాధర్‌ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేశారు. విజిలెన్స్‌ అధికారులు, పదిమంది ఏఈలు టీమ్‌లుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు ట్రాన్స్‌కో ఇందుర్తి సెక్టార్‌ ఏఈ వంశీకృష్ణ తెలిపారు. గృహావసరాలకు అక్రమంగా విద్యుత్‌ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. 
     
     
     
     

Advertisement
 
Advertisement
Advertisement