రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా | tomorrow jobmela in employment office | Sakshi
Sakshi News home page

రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా

May 10 2017 11:11 PM | Updated on Sep 5 2017 10:51 AM

జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం  ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఎస్‌ఎల్‌ మైనింగ్‌ రిసోర్సెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఆపరేటర్‌ ట్రైనీ ఉద్యోగాల కోసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ఈ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాలలోపు వయస్సుగల వారు, ఐటీఐ(ఫిట్టర్‌ట్రేడ్‌) చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు బేతంచర్ల మండలం వీరయపల్లి గ్రామంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీరికి రూ.8,700  నుంచి రూ.9వేల వరకు జీతం ఇస్తామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement