రేపు జాబ్‌ మేళా | tomorrow jobmela | Sakshi
Sakshi News home page

రేపు జాబ్‌ మేళా

Aug 2 2017 10:45 PM | Updated on Sep 11 2017 11:06 PM

ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ కంపెనీలో ఉద్యోగాల కోసం శుక్రవారం అర్హుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు.

అనంతపురం రూరల్‌: ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ కంపెనీలో ఉద్యోగాల కోసం శుక్రవారం అర్హుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని జిల్లా  గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు. రాప్తాడు సమీపంలో ధర్మవరం పంగల్‌ రోడ్డులో ఉన్న టీటీడీసీలో ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఐటీఐ చేసి, 24 సంవత్సరాల లోపు వయసున్న వారు ఇందుకు అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, రేషన్, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లతోపాటు విద్యా అర్హత పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement