నేడు ‘పేట’లో బహిరంగ సభ | Today Open Meeting in "Peta' | Sakshi
Sakshi News home page

నేడు ‘పేట’లో బహిరంగ సభ

Jul 24 2016 10:27 PM | Updated on Sep 4 2017 6:04 AM

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌): జీఓ 69 ప్రకారం భీమా ఫేజ్‌–1 ద్వారా నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల చేపట్టాలని జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి డిమాండ్‌ చేశారు.

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : జీఓ 69 ప్రకారం భీమా ఫేజ్‌–1 ద్వారా నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల చేపట్టాలని జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు నారాయణపేట పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నామన్నారు. ముఖ్య అతిథులుగా గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల్లాకొత్వాల్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, బీజేపీ శాసనసభ ఉపనాయకుడు ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యురాలు కె.రమా, పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.హన్మేష్‌ హాజరవుతారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement