-
ఏలూరు ‘సిద్ధం’కు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షిఅమావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు గురువారం పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ ఆకారంలో భారీ వాక్వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. గోదావరి ప్రజలు సిద్ధం : మంత్రి కారుమూరి ఎన్నికలకు జగన్మోహన్రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఇంటి బిడ్డ అని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన నేత అని కొనియాడారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దెందులూరులో జనసునామీ చూడబోతున్నారని, చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులు ఉన్నారు. 3న దెందులూరుకు సీఎం ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో అమిత్ షా పర్యటన
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో షా ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్పేట నియోజకవర్గాల పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. 25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్చెరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్, సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న బహిరంగ సభలలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రసంగించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇళ్ల యజ్ఞం.. ఊళ్లకు ఊళ్లే నిర్మాణం
దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అధికారంలోకి రాగానే 300 అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని గతంలో ఇదే గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. ఈ రోజు ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నా. ఇవిగో ఆ ఇళ్లు.. ఇవిగో ఆ ఊళ్లు. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం రూ.16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది. ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి? గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదు. నిస్సిగ్గుగా తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నోరు విప్పితే అబద్ధాలే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం కొనసాగుతోందని, ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇది పేదల బాగు కోసం పరితపించే ప్రభుత్వం అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 77 ఎకరాల ఒకే లేఅవుట్లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకంగా 30.60 లక్షల ఇంటి పట్టాలు అందజేశామని, ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో సైతం అన్ని అడ్డంకులను అధిగమించి, చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అడ్డుకొని, సుప్రీంకోర్టులో మరీ పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం పేదలను అప్పులపాలు చేయాలని చూస్తే, మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామని చెప్పారు. అక్కచెల్లెమ్మలు హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా ఇవాళ మనం ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్త గుడివాడ కనిపిస్తోంది ♦ ఒకవైపు టిడ్కో ఇళ్లు.. మరోవైపు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు చూస్తుంటే.. ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. మొత్తం 257 ఎకరాల్లో రూ.800 కోట్లతో 8,912 ఇళ్లు కట్టడమే కాకుండా.. వాటిని నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇదే లే అవుట్లో 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. మొత్తంగా 16,640 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండబోతున్నాయి. అంటే ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా దాదాపు 50 వేల మంది జగనన్న లే అవుట్లో నివాసం ఉండబోతున్నారు. ♦ ఈ లేఅవుట్తో పాటు నియోజకవర్గం మొత్తం 13,145 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటికి 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలిచ్చామని గర్వంగా చెబుతున్నా. ♦ ఈ లేఅవుట్ ఇంటి స్థలం విలువ ఎంత ఉంటుందని ఇక్కడకు వచ్చే ముందు ఎమ్మెల్యే నానిని అడిగాను. గజం రూ.14 వేలని, ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన స్థలం రూ.7 లక్షలు ఉంటుందని చెప్పాడు. అంటే ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన 1.1 సెంటు స్థలం ద్వారా రూ.7 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టయింది. ♦ ఒక్కో ఇంటిని రూ.2.70 లక్షలతో కడుతున్నాం. అక్కడ డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం రూ.10–15 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లు కూడా చూసుకుంటే మహాయజ్ఞం ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ♦ ఇవాళ ఇచ్చిన పట్టాలకు సంబంధించి 4,200 ఇళ్లు మంజూరైతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాలలో కూడా ఇళ్లు వస్తాయి. జూలై 8.. నాన్న గారి జయంతి రోజున ఈ ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. ఇలాంటి అభివృద్ధి గుడివాడలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో, మమకారంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంటి స్థలాల విలువే రూ.75 వేల కోట్లు మనందరి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. కేవలం రూ.2.5 లక్షల చొప్పున వేసుకున్నా, 30.60 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.75,000 కోట్లకు పైగా ఉంటుంది. టిడ్కో ఇళ్ల పేరుతో నాడు పేదలపై భారం ♦ ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాలు మీకు తెలియాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకమిది. నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు రూ.2 వేలు చొప్పున ఒక్కో ఫ్లాట్కు దాదాపు రూ.5.75 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో రూ.లక్ష అవుతుంది. ♦ రూ.6.75 లక్షలు ఖర్చయ్యే ఒక్కో ఫ్లాట్కు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.5 లక్షలు ఇస్తోంది. మిగిలిన రూ.3 లక్షలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా రూ.3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూపోవాలి. అలా రూ.7.20 లక్షలు పేదవాడు తన జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. ♦ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులలో నిర్మిస్తున్న 1,43,600 టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. రూ.6.75 లక్షలయ్యే ఒక్కో ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. ♦ 365 చదరపు అడుగుల ఇంటికి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న రూ.3 లక్షల సబ్సిడీకి అదనంగా రూ.50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత రూ.3 లక్షలు ఇవ్వడంతో పాటు వాటిలో సిమెంటు రోడ్డులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో రూ.లక్ష ఖర్చు పెట్టారు. మరో రూ.25 వేలు కలిపి ప్రతి పేద వాడికి రూ.4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. ♦ 430 చదరపు అడుగులు ఇంటికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.3 లక్షలు కాకుండా, మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష వేసుకుని.. గతంలో తీసుకున్న డిపాజిట్ను రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించాం. రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. రూ.4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. పేదల వ్యతిరేకి చంద్రబాబు ♦ నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఇదే పని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? అందరూ ఆలోచించాలి. కారణం చంద్రబాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ♦ అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని చంద్రబాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు. ఏకంగా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి అమరావతిలో 50 వేల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ♦ మన ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్షకు తావు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసింది. నాలుగేళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ.31 వేల కోట్లు ఇచ్చాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మల పిల్లల బాగోగుల కోసం రూ.19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ.19,178 కోట్లు, చేయూతగా రూ.14,129 కోట్లు ఇచ్చాం. ♦ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.14,913 కోట్లు ఇవ్వగలిగాం. సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేలు చేశాం. గుడివాడకు వెన్నుపోటు అల్లుడు ♦ ఇదే గుడివాడకు చెందిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న అల్లుడు.. ఆయన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చారు? కనీసం ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టించలేదు. ♦ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అనుమతివ్వండి అంటూ అడుగుతున్నాడు. కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల తర్వాత.. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు సొంతిల్లు కట్టుకుంటారట. ♦ ఇప్పుడు మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి అన్నీ చేసేస్తా అంటాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారూ ఇస్తానని చెబుతారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఇలా మాయ మాటలు చెబతూ మళ్లీ మోసం చేయడానికి బయలుదేరాడు. ♦ ఫలానా మంచి పని చేశాను కాబట్టి చాన్స్ ఇవ్వండి అని అడగలేని పరిస్థితి ఆయనది. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని ఈయనకు ప్రజలను ఓటు అడిగే నైతికత కూడా లేదు. ఊరూరా విప్లవాత్మక మార్పులు ♦ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే లంచాలు, వివక్షకు తావివ్వని వలంటీర్ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకొచ్చాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ♦ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, ఫిషింగ్ సెంటర్లు కడుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం.. ఇలా అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ఊరూరా కళ్లెదుటే కనిపించేలా మనసు పెట్టి పని చేసిన ప్రభుత్వం మనదే. ♦ 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని పరిస్థితి. ఇలాంటి ఈ చంద్రబాబు.. 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులను కూడా పెట్టలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి అట! రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటున్నట్లు ప్రవర్తిస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. తన జీవితమే బాబు కోసమని, తన వ్యాన్ను చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానంటున్నారు. వీరికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. మొత్తంగా గజ దొంగల ముఠా మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రజల ముందుకు వస్తోంది. వీళ్ల మాదిరిగా నాకు హంగూ, ఆర్భాటం, ఇతర పార్టీలు, చానళ్లు తోడు లేకపోవచ్చు. ఈ తోడేళ్ల గుంపు అంతా ఒక వైపు ఉంటే, మీ బిడ్డ మాత్రం మిమ్మల్ని, దేవుడిని నమ్ముకుని ఒంటరిగా మరోవైపు ఉన్నారు. మీరంతా ఈ దుష్టచతుష్టయం అబద్ధాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మారండి. గుడివాడకు వరాల జల్లు గుడివాడ నియోజకవర్గంలో మరికొన్ని మంచి పనులకు సాయం కావాలని ఎమ్మెల్యే నాని అడిగారు. గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటికకు రూ.5 కోట్లవుతుందన్నారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో మంచినీటి సరఫరా కోసం ల్యాండ్ అక్విజేషన్ కావాలన్నారు. అందుకు రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నాం. మల్లాయపాలెం లే అవుట్లో ఇంటర్నల్ రోడ్డు కోసం మరో రూ.9 కోట్లు ఇస్తున్నాం. గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు రూ.26 కోట్లతో శంకుస్థాపన చేశాం. కృష్ణా జిల్లాలో రూ.750 కోట్లతో జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న పైప్లైన్ ప్రాజెక్టులో భాగంగా గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం రూ.160 కోట్లు కేటాయిస్తూ ఈ పనులకూ శంకుస్థాపన చేశాం. మనం మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్గా భావించి.. 99 శాతం హామీలు నెరవేర్చాం. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు.. ప్రతిసారీ మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేశాడు. మన పార్టీ పేదల హృదయం నుంచి పుట్టింది కాబట్టి.. ఇలా మంచి పనులు చేయగలుగుతున్నాం. టీడీపీ పెత్తందార్ల పార్టీ.. వారంతా గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని, ప్రజలను నమ్ముకుంటే.. వారు పొత్తులు, ఎత్తులు, చిత్తులంటూ దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు. – సీఎం వైఎస్ జగన్ -
లక్ష మందితో అమిత్షా సభ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర హోంమంత్రి అమిత్షా ఈనెల 15న ఖమ్మం వస్తున్న నేపథ్యంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ వెల్లడించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్, జిల్లా నేతలతో కలిసి శుక్రవారం ఆయన ఖమ్మంలోని ఎస్పీ స్టేడియం, పక్కనే ఉన్న ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమిత్షా మొదటిసారి ఖమ్మంలో పర్యటిస్తుండటంతో జనం పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని, అందుకే సువిశాల ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాన్ని ఎంపిక చేశామని చెప్పారు. సభకు స్వచ్ఛందంగా తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం స్టేడియంలో పిల్లలతో బండి సంజయ్ సరదగా ఫుట్బాల్ ఆడారు. స్టేడియం పక్కనే ఉన్న కేఫ్లో కార్యకర్తలతో కలిసి చాయ్ తాగారు. బీజేపీ సింగిల్గా పోటీ చేస్తుంది.. అంతకుముందు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నేతలతో సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. కమ్యూనిస్టులను కేసీఆర్ విమర్శించినా.. వారు మాత్రం బీఆర్ఎస్ పంచనే చేరుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సింహంలా సింగిల్గా పోటీ చేస్తుందని, అందరూ కష్టపడి పనిచేసి కాషాయ రాజ్య స్థాపనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎం.ధర్మారావు, కొండేటి శ్రీధర్, కుంజా సత్యవతి, నేతలు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, కొండపల్లి శ్రీధర్రెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, సినీనటి కవిత, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కోనేరు చిన్ని పాల్గొన్నారు. -
24న ఔరంగాబాద్లో బీఆర్ఎస్ సభ
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణకు ప్రాధాన్యమిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే రెండు సభలను నిర్వహించగా.. తాజాగా మూడో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేదిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన వివిధ పా ర్టీల నేతలు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్లో చేరుతున్నారు. బీజేపీ, శివసేనతోపాటు ఎన్సీపీ, శివసంగ్రామ్పార్టీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ జాబితాలో ఉన్నారు. షెట్కారీ సంఘటన్ నేత శరద్ ప్రవీణ్జోషి, మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న డోంగె, సంగీత థోంబర్తోపాటు వివిధ పా ర్టీల తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేతలు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. గ్రామ స్థాయిలో బలోపేతానికి ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాలతోపాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై బీఆర్ఎస్ దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రధానంగా లాతూర్, నాందేడ్, యవత్మాల్, చంద్రాపూర్, షోలాపూర్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, నాసిక్ జిల్లాలపై ఫోకస్ చేసింది. పా ర్టీలోకి చేరికలు కూడా ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే నాందేడ్లో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ తొలిసభను నిర్వహించగా.. మార్చి 6న కాంధార్–లోహలో రెండో సభ జరిగింది. తాజాగా ఔరంగాబాద్లో మూడో సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఏర్పాట్లు ప్రారంభమవుతాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తర్వాత షోలాపూర్లో.. ఔరంగాబాద్ తర్వాత మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం లేదా పూర్వపు హైదరాబాద్ స్టేట్లో భాగమైన షోలాపూర్ను ఎంచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చేరికలను కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు ద్వారా.. పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీతోపాటు, బీఆర్ఎస్ రైతు విభాగం మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాణిక్ కదమ్ తదితరులు చేరికలు, పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరోవైపు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ మహారాష్ట్ర నేతల చేరికలను సమన్వయం చేస్తున్నారు. అంకాస్ మైదానంలో బహిరంగ సభ ఔరంగాబాద్ సభకు సంబంధించి మహారాష్ట్రలోని కన్నడ్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే, హర్షవర్ధన్ జాదవ్, సీనియర్ నాయకులు అభయ్ కైలాస్రావు పాటిల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభకు జన సమీకరణ, ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఔరంగాబాద్ సభ జరుగుతున్నట్లు ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రకటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement