రైల్వేబడ్జెట్లో జిల్లాకు అరకొర కేటాయింపులు
తిరుపతిలో విశ్రాంతి గదికి రూ.7 కోట్లు
తిరుచానూరు స్టేషన్ అభివృద్ధికి రూ.6 కోట్లు
తిరుపతి : ఊహించిందే జరిగింది. కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు మళ్లీ అత్తెసరు నిధులే లభించాయి. రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిన మేజరు ప్రతిపాదనలకు ఆశిం చిన మేర నిధులు మంజూరు కాలేదు. కేవలం తిరుపతి, తిరుచానూరు రైల్వేస్టేషన్లకు మాత్రమే రూ.13 కోట్లు విదిలించారు. జిల్లా రైల్వే ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం రూ. 80 కోట్లు అవసరమన్న రైల్వే ఇంజినీరింగ్ అధికారుల తాజా ప్రతిపాదనలను కేంద్రంగా పెద్దగా పట్టించుకోలేదు. రైల్వేమంత్రి మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈసారి తిరుపతికి ఎక్కువ నిధులు దక్కుతాయని ఆశించిన రాజకీయ, ఉద్యోగ వర్గాలకు నిరాశే ఎదురైంది.
జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు విశేషముంది. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్య లో ఇక్కడికి యాత్రికులు వస్తుంటారు. ఈ రెండు స్టేషన్లకు రోజువారీ ఆదాయం కూడా ఎక్కువ. తిరుపతి రోజువారీ ఆదాయం రూ.40 లక్షలకు పైనే ఉంటుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు పంపుతున్నారు. దీనికితోడు బాలాజీ రైల్వే డివిజన్గా తిరుపతిని ప్రకటించాలన్న ప్రతిపాదనలు 1992 నుంచి పెండింగ్లో ఉన్నాయి. దీనిపై స్పందించని కేంద్రం 2017–18 రైల్వే బడ్జెట్లో కేవలం రూ.13 కోట్లతో మమ అనిపించారు.
తిరుపతికి రూ.7 కోట్లు....
ప్రస్తుతం తిరుపతి స్టేషన్లో రెండు జనరల్ వెయిటింగ్ హాళ్లు, రెండు ఏసీ వెయిటింగ్ హాళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రమూ చాలడం లేదు. దీన్ని గుర్తించిన కేంద్రం మరో విశ్రాంతి హాలు కోసం తాజా బడ్జెట్లో రూ.7 కోట్లు కేటాయించింది. అదేవిధంగా తిరుచానూరు స్టేషన్ అభివృద్ధి కోసం రూ.6 కోట్లు కేటాయించింది. ఇదే స్టేషన్కు కిందటి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించినప్పటికీ పూర్తిస్థాయి రైల్వేస్టేషన్ అభివృద్ధి కోసం ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు తాజాగా రూ.25 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపారు. అయితే కేవలం రూ.6 కోట్లు మాత్రమే దక్కాయి.
నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైనుకు రూ.340 కోట్లు
ఈసారి మాత్రం నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను పనులకు కాస్త కేటాయింపులు పెంచారు. రూ.340 కోట్లు కేటాయించారు. 309 కిలోమీటర్ల నిడివి గల నూతన రైల్వే మార్గం నిర్మాణానికి మొత్తం రూ.1313 కోట్లు అవసరమని 2011–12లో అంచనా వేశారు. కాగా కిందటి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు.
మళ్లీ అత్తెసరు నిధులే
Published Sat, Feb 4 2017 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement