యాదగిరిగుట్ట : రాష్ట్రంలో పెత్తందార్ల పాలనకు స్వస్తి పలికి బహుజన బతుకమ్మను కాపాడుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆదివారం మండలంలోని చొల్లేరులో చివరి రోజు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే తీరోక్క పూల జాతర బతుకమ్మ అని అన్నారు. వలసలు ఆగి పోవాలంటే.. కరువు వెనక్కి వస్తేనే బతుకమ్మను కాపాడుకున్నట్లని తెలిపారు. శ్రమజీవుల నోటిలో నిత్యం వెలువడే ఉయ్యాల పాటలు ఉండాలంటే బహుళ జాతి పరిశ్రమలను తరిమికొట్టి బతుకమ్మ ప్రత్యేకతను ప్రజలకు లె లియపరచాలని కోరారు. బతుకమ్మ సాక్షిగా ప్రతి మహిళా అభ్యున్నతి సాధించాలన్నారు. ఏడాది ఒక్క సారి మహిళలంతా ఒకే చోట చేరి పాటలు పాడుతూ, ప్రకృతి దేవతను పూజించడం గొప్ప సంస్కృతి తెలంగాణ మహిళలకే దక్కిందన్నారు. ఈ వేడుకల్లో పీస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కొక్కలకొండ నిమ్మయ్య ఉన్నారు.
బహుజన బతుకమ్మను కాపాడుకుందాం
Published Sun, Oct 9 2016 10:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement