భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని నకిరేకల్ గ్రామానికి చెందిన గిరి(20) మంగళవారం రైసుపేట గ్రామానికి వచ్చాడు. రాత్రి గ్రామంలో జరిగిన దుర్గ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్దీపాల తీగలు ప్రమాదవశాత్తు తగలటంతో షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తండ్రి చర్లలో జీసీసీ సేల్స్మన్గా పనిచేస్తున్నట్లు తెలిసింది.