సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ | The CPI (ML) is a huge rally in kothagudem | Sakshi
Sakshi News home page

సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Jun 20 2017 5:09 PM | Updated on Aug 13 2018 4:30 PM

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీ, గిరిజనులు కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీ, గిరిజనులు కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. హరితహారం పేరున ఆదివాసీ, గిరిజన పేదల భూములు గుంజుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని, రైతులపై అక్రమంగా బనాయించిన కేసులు రద్దు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. అలాగే 10 వేల రూపాయల ఆర్దిక సాయం అందించి, గిరిజన, దళిత కుటుంబాలకు భూమి పంచాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement