రూ. వంద కోసం.. | The brutal murder of a man | Sakshi
Sakshi News home page

రూ. వంద కోసం..

Jun 28 2016 4:02 AM | Updated on Aug 11 2018 8:48 PM

రూ. వంద కోసం.. - Sakshi

రూ. వంద కోసం..

కర్నూలు నగరం బుధవారపేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అదే కాలనీలో నివాసం....

వ్యక్తి దారుణ హత్య

కర్నూలు/కల్లూరు(రూరల్):
కర్నూలు నగరం బుధవారపేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అదే కాలనీలో నివాసం ఉంటున్న ఇబ్రహీం (30), జయన్న కలిసి సెంట్రింగ్ పని చేసేవారు. జయన్న ప్రస్తుతం అయ్యప్ప స్వామి దేవాలయంలో అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఇద్దరూ కలిసి సోమవారం సాయంత్రం సుశీల నేత్రాలయ సమీపంలో ఉన్న కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లారు. ఇదే సందర్భంలో ఇబ్రహీంను వంద రూపాయలు ఇవ్వాల్సిందిగా జయన్న కోరగా.. తన దగ్గర లేవంటూ నిరాకరించడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇరువురు చొక్కాలు పట్టుకుని వాదులాడుకున్నారు. కోపంలో ఇబ్రహీం చెంపపై జయన్న కొట్టడంతో పక్కనే ఉన్న రాతిదూళానికి తగలడంతో తలకు గాయమై కిందపడ్డాడు. తీవ్ర రక్తస్రావమే అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావు, క్రైం పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశరాలను పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఇబ్రహీంకు భార్య షహనాజ్‌తో పాటు ఇద్దరు సంతానం. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement