అదృశ్యమైన బాలుడు బావిలో శవమై తేలాడు | The boy disappeared found dead | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన బాలుడు బావిలో శవమై తేలాడు

Sep 20 2016 2:19 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లా కోదాడ మండలం మొగులాయిపల్లి గ్రామానికి చెందిన జగన్నాథరెడ్డి(7) అనే బాలుడు వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.

 నల్గొండ జిల్లా కోదాడ మండలం మొగులాయిపల్లి గ్రామానికి చెందిన జగన్నాథరెడ్డి(7) అనే బాలుడు వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే ఆ బాలుడు మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బావిలో శవమై తేలాడు. ఖమ్మం పట్టణలోని గుర్రాలబండ బావిలో బాలుడు శవమై తేలుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలుడిని జగన్నాథరెడ్డిగా గుర్తించారు. నల్గొండ జిల్లాలో అదృశ్యమైన బాలుడు ఖమ్మం జిల్లాలో బావిలో శవమై తేలడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా కిడ్నాప్ చేసి హతమార్చి బావిలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement