చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల నియామకం | The appointment of the Chief Vigilance Officers | Sakshi
Sakshi News home page

చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల నియామకం

Sep 2 2016 7:56 PM | Updated on Aug 18 2018 3:49 PM

రవాణా,ఆర్ అండ్ బీ శాఖల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

- రవాణా, ఆర్ అండ్ బీ శాఖలకు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి

 రవాణా, రహదారులు, భవనాల శాఖల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసరుగా ప్రభుత్వ అదనపు కార్యదర్శి బి.నాగరాజ, ఆర్‌అండ్‌బీకి ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి కె.రామమోహనరావులను నియమించారు. వీరిద్దరూ ఆయా శాఖల విజిలెన్స్ విభాగాల బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏసీబీ కేసులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ కేసుల్ని పర్యవేక్షిస్తారు.


 

Advertisement
 
Advertisement
Advertisement