23, 24 తేదీల్లో టెలీ కాన్ఫరెన్స్‌ | tele conferance in 23rd and 24th | Sakshi
Sakshi News home page

23, 24 తేదీల్లో టెలీ కాన్ఫరెన్స్‌

Mar 21 2017 11:30 PM | Updated on Sep 5 2017 6:42 AM

త్రీఆర్స్‌ సర్వే ఫలితాలలు, విశ్లేషణ, 100 రోజుల రెమెడియేషన్‌ కార్యక్రమ ప్రణాళిక, సబ్జెక్ట్‌ వారీగా రెమెడియేషన్‌ కార్యక్రమంపై రాష్ట్ర అధికారులు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : త్రీఆర్స్‌ సర్వే ఫలితాలలు, విశ్లేషణ, 100 రోజుల రెమెడియేషన్‌ కార్యక్రమ ప్రణాళిక, సబ్జెక్ట్‌ వారీగా రెమెడియేషన్‌ కార్యక్రమంపై రాష్ట్ర అధికారులు...ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఏఎంఓ, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఈ నెల 23, 24 తేదీల్లో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

23న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు బోధించే ఉపాధ్యాయుల్లో సగం మంది హాజరుకావాలని డీఈఓ సూచించారు. 24న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 1 నుంచి 5 తరగతులు బోధించే ఉపాధ్యాయుల్లో మిగతా సగం మంది పాల్గొనాలని కోరారు. 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెమెడియల్‌ టీచింగ్‌ కార్యక్రమ అమలుపై జిల్లా అధికారులు, సబ్జెక్టు ఉపాధ్యాయులతో 27న టెలీ కాన్ఫరెన్స్‌ ఉంటుందని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement