బూర్గుల దగ్గర నిలిచిన గూడ్స్... పలు రైళ్లు ఆలస్యం | tecnical issue in goods train leads running late remaing trains | Sakshi
Sakshi News home page

బూర్గుల దగ్గర నిలిచిన గూడ్స్... పలు రైళ్లు ఆలస్యం

May 28 2016 12:57 PM | Updated on Sep 4 2017 1:08 AM

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం బూర్గుల వద్ద సాంకేతిక లోపంతో శనివారం ఉదయం ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది.

షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం బూర్గుల వద్ద సాంకేతిక లోపంతో శనివారం ఉదయం ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో సాంకేతిక లోపంతో గూడ్స్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు.

ఉదయం 10.30 గంటల సమయంలో వేరొక ఇంజన్‌ను రప్పించి గూడ్స్ రైలును అక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేశారు. దీంతో సుమారు మూడు గంటలకుపైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement