
సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న రైలు ఇంజన్పై బండరాయి పడింది. దీంతో గూడ్స్ రైలు ఇంజన్ ముందు భాగం దెబ్బతింది. ఇవాళ (అక్టోబర్ 19, ఆదివారం) తెల్లవారుజామున తైడా- చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన జరిగింది. కొత్తవలస-కిరండోల్ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
విశాఖ- కిరండోల్, కిరండోల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆ మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తక్షణమే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే?