అధికారం వారికి తిరుగులేని అస్త్రమైంది. ఏ దందా చేసినా... అదుపు చేసే యంత్రాంగం కరువైంది. చెరువులో మట్టి తవ్వేసి అమ్ముకోవడం... బెల్టుదుకాణాలకు ఏకంగా బహిరంగంగా వేలం వేయడం... ఎక్కడికక్కడే ఇసుకను అక్రమంగా తవ్వేసి తరలించేయడం... మహిళా సంఘాలకు మాత్రమే ఇవ్వాలనుకున్న ఇసుక రీచ్ను తనకే అప్పగించాలని అధికారులను బెదిరించడం... ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణమైపోయింది. తాజాగా అనుమతుల్లేకుండా అడ్డగోలుగా గ్రావెల్ రెండు నెలలుగా తరలించేస్తూ లక్షలు ఆర్జిస్తున్నా... అధికారులేమీ అనలేకపోతున్నారు. ఇదీ గజపతినగరం నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ వ్యవహారం.
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గంట్యాడ: గంట్యాడ మండలం మదనాపురం గ్రామ సమీపంలో గల ప్రాంతీయ వన సంరక్షణ సమితికి దగ్గరలో విలువైన గ్రావెల్ లభ్యమవుతోంది. సర్వే నంబర్ 52/6, 52/7లో గల కొండ ప్రాంతంలో మైనింగ్ అధికారులు ఓ వ్యక్తికి తవ్వకానికి అనుమతి ఇచ్చారు. కానీ దీనిని ఆసరాగా చేసుకుని ఆ పక్కనే ఉన్న స్థలంలో ఎమ్మెల్యే అనుచరుడు, టీడీపీ మండల ప్రజాప్రతినిధికి బావమరిది దగ్గరుండి ఎటువంటి అధికారిక అనుమతులులేకుండానే గ్రావెల్ తవ్వకాలు జరిపిస్తున్నారు.
పొక్లెయిన్ పెట్టి రెండు నెలలుగా తవ్వకాలు జరిపి, లారీల ద్వారా గ్రావెల్ తరలించేస్తున్నారు. గతంలో వేరే రోడ్డు పనులకు ఉపయోగించగా, ప్రస్తుతం తాటిపూడి రిజర్వాయర్ ముఠా చానల్కు ఆనుకుని మరడాం నుంచి రామభద్రపురం వరకు వేస్తున్న రోడ్డు పనులకు దీనిని వాడుతున్నారు. రోజుకు దాదాపు 50లారీల వంతున ఇప్పటి వరకు 3వేల లారీలతో గ్రావెల్ తరలించేసినట్టు తెలుస్తోంది. ఒక్కో లారీ లోడు విలువ రూ. 1500లు ఉంటుంది. ఈ లెక్కన రూ. 45లక్షలు విలువైన గ్రావెల్ తరలిపోయినట్టు స్పష్టమవుతోంది.
పట్టించుకోని అధికారులు
ఇన్ని నెలలుగా అడ్డగోలు తవ్వకాలు చేపడుతున్నా ఏ అధికారీ ఆపే ప్రయత్నం చేయలేదు. కళ్ల ముందే లక్షలాది రూపాయల విలువైన గ్రావెల్ తరలిపోతున్నా... ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా... చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీనిని గమనించిన సిరిపురం ఎంపీటీసీ, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ ఒక అడుగు ముందుకేసి గ్రావెల్ తవ్వకాలను శనివారం అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తవ్వకాలు దగ్గరుండి జరిపిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తి కలగ చేసుకుని ఎమ్మెల్యే పనులకు ఉపయోగిస్తున్న గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటారా? ట్రాన్స్పోర్ట్ పర్మిట్ ఉన్నా ఎందుకు అడ్డు చెబుతున్నారని వాదనకు దిగారు. తవ్వకాలకే అనుమతుల్లేనప్పుడు తరలింపేంటని ప్రశ్నించగా కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయమై తహశీల్దార్ బాపిరాజు వద్దకెళ్లి జైహింద్కుమార్ ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని ఆయన్ను నిలదీయగా అక్కడ అనుమతుల్లేవని, తవ్వకాలు జరుపుతున్నట్టు తెలియదని, వీఆర్ఓతో పాటు ఆర్ఐని పంపించి తవ్వకాలు నిలిపివేయిస్తానని ఆయన్ను శాంతపరిచారు.
ఎమ్మెల్యేకు భయపడే...
అన్నీ తెలిసినా అధికారులు దీనిపై నోరుమెదపడం లేదు. ఎవరైనా అడిగితే తమ దృష్టికి రాలేదంటూ తాత్కాలికంగా తప్పించుకుంటున్నారు. దీనంతటికీ కారణం అక్కడి ఎమ్మెల్యే వారి వెనుక ఉండటమే. అధికారులు తమ విచక్షణాధికారాన్ని వినియోగిస్తే... వారిని ఎమ్మెల్యే టార్గెట్చేసి ఇరుకున పెడతారనే భయం. ఇదే అదనుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా టీడీపీ దందా విచ్చలవిడిగా సాగుతోందని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ సాక్షి వద్ద వ్యాఖ్యానించారు.
అధికారం వారికి తిరుగులేని అస్త్రమైంది
Published Sun, Dec 27 2015 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement