‘ప్రతి ఒక్కరూ భగవత్‌ స్వరూపులే’ | swarupananda swamy in obulapuram | Sakshi
Sakshi News home page

‘ప్రతి ఒక్కరూ భగవత్‌ స్వరూపులే’

Oct 14 2016 11:54 PM | Updated on Sep 4 2017 5:12 PM

‘ప్రతి ఒక్కరూ భగవత్‌ స్వరూపులే’

‘ప్రతి ఒక్కరూ భగవత్‌ స్వరూపులే’

సమాజంలో ప్రతి ఒక్కరూ భగవంతుని స్వరూపులేనని ద్వారక శారద పీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి పేర్కొన్నారు.

డి.హీరేహాళ్‌ : సమాజంలో ప్రతి ఒక్కరూ భగవంతుని  స్వరూపులేనని ద్వారక శారద పీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హంపి నుంచి డి.హీరేహాళ్‌ మండలం ఓబుళాపురం గ్రామానికి ఆయన చేరుకున్నారు. ఆయనకు  ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, ఆర్డీఓ రామారావు స్వాగతం పలికారు. అనంతరం మహాలక్ష్మి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించాలని, అధర్మాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.

గోవిందానంద సరస్వతి మాట్లాడుతూ హిందూసాంప్రదాయాలతోనే భారతీయత ముడిపడివుందన్నారు. కార్యక్రమానికి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ చంద్రహాస్, రాష్ట్ర ధర్మసంరక్షణ సమితి అధ్యక్షులు రఘుస్వామి, స్థానిక నాయకులు నాగళ్ళిరాజు, హనుమంతరెడ్డి, మోహన్‌రెడ్డి, ఆనందరెడ్డి, వెంకటరెడ్డి, అంగడి రాజశేఖర్, మహబళి, చంద్రశేఖర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement