జాతీయ స్థాయిలో భోపాల్లో నిర్వహించిన రోప్ స్కిప్పింగ్ పోటీల్లో తుని మండలం వి.కొత్తూరు సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఈ నెల 6 నుంచి 12 వరకూ జరిగిన ఈ పోటీల్లో తమ విద్యార్థులు తృతీయ స్థానం
జాతీయస్థాయి రోప్ స్కిప్పింగ్ లో మూడో స్థానం
Nov 14 2016 10:22 PM | Updated on Sep 4 2017 8:05 PM
తుని రూరల్ :
జాతీయ స్థాయిలో భోపాల్లో నిర్వహించిన రోప్ స్కిప్పింగ్ పోటీల్లో తుని మండలం వి.కొత్తూరు సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఈ నెల 6 నుంచి 12 వరకూ జరిగిన ఈ పోటీల్లో తమ విద్యార్థులు తృతీయ స్థానం
కైవశం చేసుకున్నారని పీఈటీ సాధన సోమవారం తెలిపారు. అండర్–14లో ఎం.ప్రిన్సీ, జి.దేవి, టి.స్వర్ణలత, ఎస్.చాందిని తృతీయ స్థానం సాధించారని చెప్పారు. అండర్–16 వ్యక్తిగత విభాగంలో వి.న్యూరోజీ తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాది అండర్–14 విభాగంలో వీరికి స్వర్ణపతకం లభించిందన్నారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ రమా మహేశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు.
Advertisement
Advertisement