సూల్క్ బస్సు ఢీ కొని విద్యార్థి మృతి | School Bus Crash Kills Student in visakhapatnam | Sakshi
Sakshi News home page

సూల్క్ బస్సు ఢీ కొని విద్యార్థి మృతి

Sep 16 2015 9:17 AM | Updated on Sep 15 2018 5:45 PM

విశాఖపట్నం నగరంలోని సింహాచలం గోశాల వద్ద విషాదం చోటు చేసుకుంది.

విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలోని సింహాచలం గోశాల వద్ద విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొని 10వ తరగతి విద్యార్థి అవినాష్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

స్కూల్ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. అయితే స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్తున్న తమ్ముడికి నోట్ బుక్ అందించేందుకు వచ్చి... ఇలా విగత జీవిగా మారడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement