అప్పుల బాధతో గిరిజన రైతు ఆత్మహత్య | Sad debt tribal farmer suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో గిరిజన రైతు ఆత్మహత్య

Sep 22 2016 12:40 AM | Updated on Nov 6 2018 8:04 PM

అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తీగారం గ్రామ శివారు లింబనాయక్‌తండాలో బుధవారం జరిగింది. బాధి త కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోతు మోతీలాల్‌(45) వ్యవసాయం చేసుకుంటూ తన భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు.

జఫర్‌గఢ్‌ : అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తీగారం గ్రామ శివారు లింబనాయక్‌తండాలో బుధవారం జరిగింది. బాధి త కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోతు మోతీలాల్‌(45) వ్యవసాయం చేసుకుంటూ తన భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు. మోతీ లాల్‌కు ముగ్గురు కుమార్తెలు ఉండగా ఇందులో ఇద్దరి వివాహం చేశాడు. పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులతోపాటు కరువు తీవ్రత వల్ల గత రెండేళ్లుగా పంట దిగుబడి రాక మరిం త అప్పుల పాలయ్యాడు. రోజూలాగే తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన మోతీలాల్‌ అక్కడే మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చా డు. పురుగుల మందు తాగిన విషయాన్ని తన భార్యకు చెప్పి ఇంటి వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement