యాదాద్రికి భక్తులు పోటెత్తారు.
యాదాద్రి: యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీనర్సింహ స్వామివారి ధర్మ దర్శనానికి ప్రస్తుతం మూడున్నర గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండున్నర గంటలు పడుతోంది. కార్తిక మాసం కావడంతో భక్తుల రద్దీ వీపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.