అద్దె సొమ్ము స్వాహా! | RTC staff irregularities | Sakshi
Sakshi News home page

అద్దె సొమ్ము స్వాహా!

Dec 31 2016 10:25 PM | Updated on Sep 27 2018 4:42 PM

అద్దె సొమ్ము స్వాహా! - Sakshi

అద్దె సొమ్ము స్వాహా!

ఆర్టీసీ ఉద్యోగులు సంస్థకే కన్నం వేశారు. సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని నొక్కేస్తున్నారు.

ఆర్టీసీ సిబ్బంది అక్రమాలు
దాదాపు రూ.4 లక్షల వరకు మాయం
స్టాళ్ల నిర్వాహకుల నుంచి వసూళ్లు
సంస్థలో జమ చేయని ఉద్యోగులు
కొనసాగుతున్న విచారణ


హన్మకొండ :ఆర్టీసీ ఉద్యోగులు సంస్థకే కన్నం వేశారు. సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని నొక్కేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. ఆ లోటును పూరించేందుకు అదనపు ఆదాయంపై ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను,  బస్‌స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమయ్యే వస్తువుల విక్రయాలకు స్టాళ్లను అద్దె ప్రాతిపదిక కేటాయిస్తుంది. ఈ అద్దెను వసూలు చేసి సంస్థ ఖాతాలో జమ చేయాల్సిన ఉద్యోగులు..  మమేకం కాని, క్షేత్రస్థాయి ప్రజా సమస్యలపై అవగాహన లేని, క్యాడర్‌లో పట్టులేని, సమస్యలపై ఎన్నడూ ఉద్యమించని, స్థానికేతర అగ్రకుల నాయకులకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. జిల్లా కమిటీ కార్యదర్శిగా వాసుదేవరెడ్డి నియామకమే ఇందుకు నిదర్శనం. పార్టీ కార్యకర్తల అభీష్టానికి విరుద్ధంగా నామినేట్‌ చేసిన కమిటీని వెంటనే రద్దు చేయాలి’ అని పార్టీ నాయకులు, సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ప్లీనరీ నిర్వహించాలని, నామినేటెడ్‌ కమిటీ స్థానంలో జిల్లాకు చెందిన స్థానిక నాయకులచే కొత్త కమిటీని వెంటనే ఎన్నుకోవాలని, రాష్ట్ర పార్టీ కమిటీని అర్బన్‌ జిల్లా పార్టీ సభ్యుల విస్తృత సమావేశం డిమాండ్‌ చేసింది. ‘జిల్లాలో జరిగిన ప్రజా పోరాటాలతో సంబంధంలేని, పార్టీని పటిష్ట పరిచే సామర్థ్యం లేని వారికి బాధ్యతలు కట్టబెట్టి ఇప్పటికే రాష్ట్ర కమిటీ తప్పు చేసింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా, వరంగల్‌ నగరంలో పార్టీని ప్రస్తుత స్థితికి తీసుకరావడంలో కీలకపాత్ర వహించి, 25 ఏళ్లుగా పార్టీయే జీవితంగా నడుపుతున్న స్థానికుడు, వెనుకబడిన వర్గాల నేత మెట్టు శ్రీనివాస్‌ను జిల్లా కమిటీ కార్యదర్శిగా నియమించాలి. కమిటీ సభ్యులుగా జిల్లాకు చెందిన స్థానిక నాయకులనే నియమించాలి. అని రాష్ట్ర కమిటీని డిమాండ్‌ చేస్తున్నాం’ అని నాయకులు పేర్కొన్నారు.

లేఖలో పేర్కొన్న అభ్యంతరాలు...
జిల్లా పునర్విభజన తర్వాత ఏర్పడిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు రాష్ట్ర కమిటీ ఇటీవల నామినేటెడ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీలో అర్బన్‌ జిల్లా కమిటీ నేతలకు చోటు దక్కలేదు. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన వాసుదేవరెడ్డికి జిల్లా కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఇదే జిల్లాకు చెందిన ప్రభాకర్‌రెడ్డిని జిల్లా సెక్రటేరియట్‌ మెంబర్‌గా, వాంకుడోతు వీరన్నను సభ్యుడిగా నియమించారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన  గొడుగు వెంకట్, టి.ఉప్పలయ్య... భూపాలపల్లి జిల్లాకు చెందిన రాగుల రమేశ్‌ను వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమిటీ సభ్యులుగా నియమించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాపై వీరికి ఏ మాత్రం పట్టులేదన్నది అసమ్మతి నేతల వాదన. ఉద్యమాలను విచ్ఛిన్నం చేసిన చరిత్ర వీరిది అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement