ఆర్టీసీ ఈయూ నిరసన దీక్ష | rtc eu nirasana | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఈయూ నిరసన దీక్ష

Oct 28 2016 9:56 PM | Updated on Sep 4 2017 6:35 PM

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. జిల్లాలోని 9 డిపోలకు చెందిన యూనియ¯ŒS కార్మికులు సుమారు 100 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ¯ŒS.సోమరాజు డిమాండ్‌ చేశారు.10 నెలలుగా

రాజమహేంద్రవరం సిటీ :
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. జిల్లాలోని 9 డిపోలకు చెందిన యూనియ¯ŒS కార్మికులు సుమారు 100 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ¯ŒS.సోమరాజు డిమాండ్‌ చేశారు.10 నెలలుగా కార్మికుల సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోయిందని, వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మిగిలిన కాంట్రాక్ట్‌ డ్రైవర్, కండక్టర్ల పోస్టులు క్రమబద్ధీకరించాలని, మెడికల్‌ అ¯ŒSఫిట్‌ అయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో 60 రోజులు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement