కడప అర్బన్: జిల్లాలో ‘స్టాంప్ల’ కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతోంది. నిందితులంతా సమాజంలో కీలక ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా ఉన్న రిజిస్ట్రేషన్, రెవెన్యూ, బ్యాంక్ అధికారులు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జిల్లాతోపాటు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు కూడా ఈ కుంభకోణం విస్తరించిందని పోలీసులు చెబుతున్నారు.
– ఈ కుంభకోణంలో ప్రధానంగా మైదుకూరుకు చెందిన స్టాంప్ వెండర్, డాక్యుమెంట్ రైటర్ కోడూరు విజయభాస్కర్ రెడ్డి అలియాస్ భాస్కర్ సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించాడు.
– ఈ క్రమంలో మైదుకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరగుతున్న అవినీతిపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు అందాయి. ఆ శాఖ వారు ఈఏడాది జూన్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో అక్కడి నుంచి విజయభాస్కర్ రెడ్డి తన మకాం కడప రవీంద్రనగర్కు మార్చాడు.
– కడప రవీంద్రనగర్లో విజయభాస్కర్ రెడ్డి నివసిస్తుండగా రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు పాతకాలపు స్టాంప్లను కొనేందుకు వస్తూ, వెళుతూ ఉండటంతో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రవీంద్రనగర్లో విజయభాస్కర్ రెడ్డి నివసిస్తున్న ఇంటిపై తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో దాడి చేశారు. అతను పరారవడంతో ఆ ఇంటి వాతావరణాన్ని గమనించి కేసు నమోదు చేశారు.
– నిందితుడు విజయభాస్కర్ రెడ్డిని ఎట్టకేలకు ఆగస్టు 15న బిల్టప్ సమీపంలో అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన అనంతరం ప్రస్తుతం ఈ కుంభకోణంలో 50 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 40 మందికి పైగా అరెస్ట్ కావాల్సి ఉంది.
రూ.కోట్లలో కుంభకోణం
రూ. కోట్లలో కుంభకోణం జరిగిందనే వాస్తవాలు క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. విజయ భాస్కర్రెడ్డి వద్ద నుంచి 2800 ఖాళీ స్టాంప్ పేపర్లు, ఇతర నిందితుల దగ్గరి నుంచి 22 నకిలీ రబ్బరు స్టాంప్లు, 24 నకిలీ పట్టాదారు పాస్పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్టాంప్లలో 1960–70 కాలం నాటివి సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారు. వీటి ఆధారంగా తాము ఎంచుకున్న ఆస్తినిగానీ, స్థలాలను గానీ, భూములనుగానీ సొంతం చేసుకుని బ్యాంకుల్లో సైతం రుణాలు పొందారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎంచక్కా రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇలా కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
– ఈ కుంభకోణంలో కొందరు బ్యాంకు అధికారులు, సిబ్బంది, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1960, 1970, 1990 కాలం నాటి స్టాంపులను కూడా వేలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని విచారణలో తెలుస్తోంది. అరెస్టు అయిన వారంతా డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్లు, నకిలీ రబ్బరు స్టాంపుల తయారీదారులు, రెవెన్యూశాఖలోని ఉద్యోగులు, వారి బంధువులు కావడం గమనార్హం. ఇంకా లోతుగా విచారిస్తామని, త్వరలో బ్యాంకులకు, రిజిస్ట్రేషన్, రెవెన్యూ కార్యాలయాలకు నోటీసులు కూడా జారీ చేస్తామని పోలీసులు అంటున్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఈ కుంభకోణం విషయంలో ప్రత్యేక దృష్టితో విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ. కోట్లలో ‘స్టాంప్ల’ కుంభకోణం!
Published Tue, Sep 20 2016 11:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement