ఇరగవరం : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇరగవరం మండలం రేలంగి గ్రామ శివారు గమళ్ల పాలెంలో గురువారం రాత్రి జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Sep 3 2016 1:57 AM | Updated on Apr 3 2019 7:53 PM
ఇరగవరం : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇరగవరం మండలం రేలంగి గ్రామ శివారు గమళ్ల పాలెంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్ఐ వి.ఎస్.వి.భద్రరావు కథనం ప్రకారం.. గమళ్ల పాలెం గ్రామానికి చెందిన కాసగాని వెంకన్న (25) స్నేహితుడు ఎ.నాగసత్యనారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై అత్తిలి మండలం పాలి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రేలంగి నుంచి పాలి వెళ్తున్న ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొంది. ఈ ఘటనలో వెంకన్న తలకు బలమైన గాయమైంది. అక్కడిక్కడే మృతి చెందాడు. సత్యనారాయణకు స్వల్పగాయాలయ్యాయి. ఈఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Advertisement
Advertisement