'తొలి రోజు అమ్మవారి నిజరూప దర్శనం' | review meeting on dasara celebrations in vijayawada | Sakshi
Sakshi News home page

'తొలి రోజు అమ్మవారి నిజరూప దర్శనం'

Sep 15 2016 1:48 PM | Updated on Jul 29 2019 6:03 PM

దసరా నవరాత్రుల తొలిరోజు శ్రీకనకదుర్గ అమ్మవారు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు.

విజయవాడ : దసరా నవరాత్రుల తొలిరోజు శ్రీకనకదుర్గ అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తారని విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు దేవస్థానం ఈవో ఏ సూర్యకుమారి వెల్లడించారు. ఓ భక్తుడు ఇచ్చిన రూ. 4 కోట్లతో రూపొందించిన స్వర్ణ కవచాన్ని అమ్మవారికి అలంకరిస్తామన్నారు.

గురువారం విజయవాడలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ. బాబు అధ్యక్షతన దసరా ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, జెడ్పీ చైర్మన్ జి.అనురాధ, విజయవాడ నగర్ మేయర్ కె. శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement