బూరుగుపూడి (మధురపూడి) : సాగునీటి కోసం అన్నదాతలు గొంతెత్తారు. శని వారం కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద రెండు గంటల సేపు రాస్తారోకో చేశారు. పుష్కర నీరు విడుదల చేయాలంటూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతో ఉన్న ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. ఆదివారం రాత్రిలోగా నీరు విడుదల చేయకపోతే, పుష్కర ఎత్తిపోతల పథకం అధికారుల కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించా రు. పథకం ఈఈ పి.వాసుదేవరావు, ఇతర అధికారులతో జక్కంపూడి చర్చిం చారు. రైతులకు అనుకూలంగా అధికారులు నడచుకోవాలని హితవుపలికారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి నీటిని మళ్లించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆగస్టులో సాగునీరు విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నీటి విడుదలకు ఈఈ హామీ ఇచ్చారు. గుమ్ములూరు, బూరుగుపూడి, మధురపూడి, బుచ్చింపేటల్లోని కెనాల్ను ఈఈ పరిశీలించారు. పార్టీ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, సీతానగరం కన్వీనర్ డాక్టర్ బాబు, రాజానగరం కన్వీనర్ మందారపు వీర్రాజు, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు బొల్లిన సుధాకర్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సర్పంచ్ కర్రి సూర్యకుమారి, పార్టీ నాయకులు అడబాల సీతారామకృష్ణ, నక్కా రాంబాబు, తోరాట శ్రీను, అడపా శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘పుష్కర’ నీటి కోసం రైతుల రాస్తారోకో
Published Sun, Aug 21 2016 12:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement