మొబైల్‌ వ్యాన్‌లో రైలు టిక్కెట్ల విక్రయం | Rail tickets selling in mobile van | Sakshi
Sakshi News home page

మొబైల్‌ వ్యాన్‌లో రైలు టిక్కెట్ల విక్రయం

Aug 13 2016 10:47 PM | Updated on Sep 4 2017 9:08 AM

పుష్కరాల సందర్భంగా కృష్ణా తీరానికి విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా రైల్వేశాఖ మొబైల్‌ వాహనంలో టికెట్ల విక్రయాలు చేపట్టింది.

సీతానగరం (తాడేపల్లి రూరల్‌): పుష్కరాల సందర్భంగా కృష్ణా తీరానికి విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా రైల్వేశాఖ మొబైల్‌ వాహనంలో టికెట్ల విక్రయాలు చేపట్టింది. సీతానగరం పుష్కరఘాట్‌ సమీపంలోని ఉండవల్లి నాలుగురోడ్ల కూడలి సెంటర్‌లో వ్యాన్‌ ఏర్పాటు చేసి ప్రయాణికులకు రైల్వే టిక్కెట్లు అమ్ముతున్నారు. ఈ వ్యాన్‌ వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు సమీపంలోని కృష్ణా కెనాల్, విజయవాడ జంక్షన్, మంగళగిరి రైల్వేస్టేషన్‌ల ద్వారా ప్రయాణాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. రైల్వేస్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడి  టిక్కెట్లు తీసుకునే అవసరం లేకుండా సౌకర్యవంతంగా ఉందని పలువురు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement