కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య | person suicide | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య

Nov 20 2016 1:44 AM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఔట్‌పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఏలూరు అర్బ¯ŒS : కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త  ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో చోటుచేసుకుంది.  ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఔట్‌పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   స్థానిక తంగెళ్లమూడిలో యామవరపు అశోక్‌ (32) అనే వ్యక్తి భార్య లక్షి్మతో కలిసి ఉంటూ పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా  భార్యాభర్తలిద్దరూ కీచులాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వారిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురైన అశోక్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన భార్య లక్ష్మి స్థానికుల సాయంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అశోక్‌ మరణించాడని నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement