సామాజిక సేవా కార్యక్రమాలతోనే మానసిక సంతృప్తి చేకూరుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ (సీడ్స్) సంస్థ ద్వారా జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న దిడ్ల పగానోను ఇటీవల ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ సంస్థ రాజీవ్గాంధీ ఎక్స్లెన్స్ అవార్డుతో సత్కరించింది.
దీనులకు అండగా నిలుస్తున్న పగానో
Aug 15 2016 12:44 AM | Updated on Sep 4 2017 9:17 AM
ఏలూరు (ఆర్ఆర్ పేట) :
సామాజిక సేవా కార్యక్రమాలతోనే మానసిక సంతృప్తి చేకూరుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ (సీడ్స్) సంస్థ ద్వారా జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న దిడ్ల పగానోను ఇటీవల ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ సంస్థ రాజీవ్గాంధీ ఎక్స్లెన్స్ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలో ఇంటర్నేషనల్ లా హౌస్లో జరిగిన కార్యక్రమంలో జూలై 25న పగానోకు మాజీ గవర్నర్ భీష్మ నారాయణ్ సింగ్ ఈ అవార్డును అందచేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యానగర్లో పగానోకు ఆర్సీఎం పరిరక్షణ సమితి ఏలూరు నేత్రాసనం, కోనసీమ ప్రతినిధులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ పగానో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధితో పాటు 56 మండలాల్లో బడి మానివేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించి వారికి విద్యావకాశాలు కల్పిస్తూ దేశంలో అక్షరాస్యత పెంపొందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. అలాగే సీడ్స్ సంస్థ ద్వారా ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన దీనులకు అండగా నిలిచి వారికి కావాలసిన నిత్యావసరాలు, బియ్యం తదితర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం కూడా చేస్తూ తన వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చుతున్నారని తెలిపారు. ఫాదర్ గుదే బల్తజార్, ఫాదర్ జీజే ఛార్లెస్, దిడ్ల ఏంజిలో, పీజే కెనడీ, తోట ఎడ్వర్డ్, తలారి మరియదాస్, టి.రాబర్ట్, టి.శ్యామ్, టి.స్వామినాథన్ పాల్గొన్నారు
Advertisement
Advertisement