బలహీన వర్గాల అణిచివేతకు ప్రభుత్వ కుట్ర | Oppression of minorities in government conspiracy | Sakshi
Sakshi News home page

బలహీన వర్గాల అణిచివేతకు ప్రభుత్వ కుట్ర

Oct 5 2016 7:15 PM | Updated on Mar 29 2019 9:31 PM

రాష్ర్ట ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను అణచివేసేందుకు కుట్రపన్నుతోందని బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొండాపూర్‌ జగన్‌ ఆరోపించారు.

బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట కార్యదర్శి జగన్‌

జహీరాబాద్‌ టౌన్‌: రాష్ర్ట ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను అణచివేసేందుకు కుట్రపన్నుతోందని బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొండాపూర్‌ జగన్‌ ఆరోపించారు. బుధవారం ఆయన  జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను విలీనం చేయాలని, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలను ఒకే గొడుగు కిందని తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.  సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పొద్దుటూరి శ్రీనివాస్‌గుప్తా, మున్సిపల్‌ సెల్‌ కన్వీనర్‌  సుధీర్‌బండారీ, ఐటీ సెల్‌ కన్వీనర్‌ ఆశోక్‌బెల్కేరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement