కపిలేశ్వరుడికి లక్ష బిల్వార్చన | one lakh bilwarchana to Kapileshwar | Sakshi
Sakshi News home page

కపిలేశ్వరుడికి లక్ష బిల్వార్చన

Aug 28 2016 10:10 PM | Updated on Mar 28 2018 11:26 AM

కపిలేశ్వరుడికి లక్ష బిల్వార్చన - Sakshi

కపిలేశ్వరుడికి లక్ష బిల్వార్చన

ధారూరు వీరభద్రేశ్వర దేవాలయంలోని కపిలేశ్వర ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ధారూరు వీరభద్రేశ్వర దేవాలయంలోని కపిలేశ్వర ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం రుద్రాభిషేకం, అనంతరం వీరభద్రేశ్వరస్వామి, పార్వతీ మాతకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు కపిలేశ్వరుడికి మారేడు దళాలతో లక్ష బిల్వార్చన చేశారు. సాయంత్రం స్వామివారిని పల్లకిలో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.                                                - ధారూరు

Advertisement
 
Advertisement
Advertisement