ప్రయాణికుల వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో : ఒకరు మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో : ఒకరు మృతి

Feb 6 2017 9:54 PM | Updated on Aug 30 2018 4:10 PM

ప్రయాణికుల వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో : ఒకరు మృతి - Sakshi

ప్రయాణికుల వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో : ఒకరు మృతి

ప్రయాణికులతో వెళుతున్న వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడిన సంఘటన మండలంలోని ఎస్‌ ఉప్పరపల్లె వద్ద కడప– తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

ఎస్‌ ఉప్పరపల్లె (రైల్వేకోడూరు రూరల్‌): ప్రయాణికులతో వెళుతున్న వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడిన సంఘటన మండలంలోని ఎస్‌ ఉప్పరపల్లె వద్ద కడప– తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ భక్తవత్సలం కథనం మేరకు ఓ పేపరు వాహనం( సాక్షి కాదు) టాటా ఏస్‌ ఏపీ 04 టీవీ 1118 నెంబరు వాహనంలో 9 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎస్‌. ఉప్పరపల్లె వద్ద సోమవారం ఉదయం 7:10 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న టీఎన్‌ 28 ఏబీ 8484 నెంబరు గల స్కార్పియో ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొంది. పేపరు వాహనాన్ని నడుపుతున్న కడప ఐటీఐ సర్కిల్‌కు చెందిన మల్లేశ్వర్‌ రెడ్డి(38) తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం తిరుపతిలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న కోడూరు ధర్మాపురానికి చెందిన నాగరత్నమ్మ, చిట్వేలి మండలం నాగవరానికి చెందిన తల్లీకొడుకులైన బొమ్మవరం శంకరమ్మ, మధులకు, మైసూరివారిపల్లెకు చెందిన సాధు మునిలక్ష్మి, నీలం భారతి, జయలక్ష్మి, ఆదిత్య, రమ్యలకు గాయాలయ్యాయి. వీరంతా తిరుపతిలో రుయా, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్కార్పియోలో ఉన్న డ్రైవర్‌, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరు తమిళనాడులోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎమ్మెల్యే కొరముట్ల పరామర్శ
ప్రమాదంలో గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరామర్శించారు. వైద్యులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement