అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. కొట్నూరు చెర్వుకట్ట సమీపంలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు మోటారుసైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాంద్పాషా అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు.