అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో కాల్మనీ వ్యాపారులు మరోసారి రెచ్చిపోయారు. తమ దగ్గర అప్పు తీసుకున్న పూజారి అడిగిన వెంటనే డబ్బులు చెల్లించకపోవడంతో ఇనుప రాడ్లతో దాడికి తెగబడి గాయపరిచారు. మోపిదేవి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న బుద్దు పవన్ కొన్ని సంవత్సరాల క్రితం వనవలయ్య అనే వడ్డీ వ్యాపారి నుంచి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. అసలు, చక్రవడ్డీలతో కలిపి అప్పు రూ.4 లక్షలకు చేరుకుంది. పవన్ అప్పుడప్పుడూ కొంత మొత్తం చెల్లిస్తున్నా వడ్డీ రేటు అధికం కావడంతో అప్పు, అప్పుగానే మిగిలింది.
కాగా, ఆదివారం రాత్రి పవన్ రేపల్లె నుంచి మోపిదేవి వస్తుండగా మోపిదేవి కాలనీలో వడ్డీ వ్యాపారి వనవలయ్య మరికొందరితో కలసి పవన్ను అడ్డగించి బాకీ తీర్చాలని అడిగాడు. దానికి పవన్ ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తప్పకుండా తీరుస్తానని కొంత సమయం కావాలని ఆయన్ను కోరాడు. దీంతో ఆగ్రహించిన వారు ఇనుప రాడ్లతో పవన్పై దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన పవన్ అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అవనిగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణాజిల్లాలో రెచ్చిపోయిన కాల్మనీ వ్యాపారులు...
Published Mon, May 30 2016 11:10 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
No Headline
కౌంటింగ్ ప్రక్రియకు సన్నాహాలు
జీవాలకు విధిగా చిటుకు వ్యాధి నివారణ టీకా
టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
భూ యాజమాన్య హక్కు చట్టంతో మేలు
వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల
అసాంఘిక చర్యలకు పాల్పడితే రౌడీషీట్
ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్మార్కెట్లు.. కారణం..
వేరబుల్స్ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- Rasi Phalalu: ఈ రాశివారి జీవితాశయం నెరవేరుతుంది
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement