రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి | old woman dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

Feb 16 2017 11:18 PM | Updated on Aug 30 2018 4:10 PM

మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది.

బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వడియంపేటకు చెందిన పామిశెట్టి పోలేరమ్మ (70) అంగడికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద బొలెరో వాహనాన్ని రివర్స్‌ తీసుకుంటూ పోలేరమ్మను ఢీకొన్నాడు. దీంతో  తీవ్రగాయాలపాలైన పోలేరమ్మను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement